కృతిశెట్టి పై ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయిన డైరెక్టర్..

“నీ కన్ను నీలి సముద్రం” పాటతో కృతిశెట్టి ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. సినిమా రిలీజ్ కాకుండానే ఆమెకు పలు అవకాశాలు వచ్చాయి. విడుదల కి ముందునుంచి “ఉప్పెన” పై భారీగానే అంచనాలు ఉన్నాయి.

లాక్ డౌన్ టైం నుంచి ఈ సినిమా ట్రెండింగ్ లోనే ఉంది. పాటలు బాగా ఆకట్టుకోవడం తో ఈ సినిమా తో పాటు కృతిశెట్టి కి కూడా బాగా హైప్ వచ్చింది.

సినిమా రిలీజ్ అయ్యి మంచి పేరు కూడా తెచ్చుకోవడం తో కృతిశెట్టి కి అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. మరో వైపు ఈ ముద్దుగుమ్మ కూడా అమాంతం తన రెమ్యునరేషన్ ను పెంచేసింది

ఒక్క పాట తో కుర్రకారుని మాయ చేసేసిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం రామ్ సరసన ఓ సినిమా లో నటిస్తోంది.

ఈ సినిమా కోసం కృతి శెట్టి కోటి కంటే ఎక్కువే రెమ్యునరేషన్ తీసుకుంటోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే.. ఈ సినిమా షూటింగ్ సమయం లో డైరెక్టర్ లింగుస్వామి ఆమెపై ఫైర్ అయ్యారంటూ ప్రచారం జరుగుతోంది.

సినిమా షూటింగ్ లో భాగం గా నాజర్ తో పాటు ఓ ఎమోషనల్ సన్నివేశం లో కృతి నటించాల్సి ఉందట. అయితే.. ఎన్ని టేక్స్ తీసుకున్నా.

ఆమె సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోవడం తో దర్శకుడు లింగు స్వామి అసహనం వ్యక్తం చేశారట.

ఆ అసంతృప్తి తో ఆమెపై ఫైర్ అయ్యారని నెట్టింట్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.