తక్కువ ధరకే ఎక్కువ ఛానల్స్ ప్రకటించిన ట్రాయ్…ధరలు ఇలా ఉన్నాయి

తక్కువ ధరకే ఎక్కువ ఛానల్స్ ప్రకటించిన ట్రాయ్…ధరలు ఇలా ఉన్నాయి

by Megha Varna

Ads

కేబుల్‌ టీవీ చార్జీల భారాన్ని కాస్త తగ్గించేలా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తాజాగా కొత్త టారిఫ్‌ ఆర్డరు ప్రకటించింది. దీంతో మరిన్ని చానళ్లు.. ఇంకాస్త చౌక రేటుకు అందుబాటులోకి రానున్నాయి. ట్రాయ్‌ తన వెబ్‌సైట్‌లో ఉంచిన ఆర్డరు ప్రకారం.. ఉచిత చానళ్ల సంఖ్య పెరగనుండగా, పే చానళ్ల చార్జీలు తగ్గనున్నాయి. అలాగే, వివిధ చానళ్లను కలిపి బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థలు అందించే బొకే ఆఫర్లపైనా ట్రాయ్‌ పరిమితులు విధించింది. వీటికి సంబంధించి ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన చర్చాపత్రాలపై పరిశ్రమవర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ మార్గదర్శకాలు రూపొందించింది. సవరించిన టారిఫ్‌లను బ్రాడ్‌కాస్టర్లు జనవరి 15లోగా, మల్టీ సిస్టం ఆపరేటర్లు 20లోగా ప్రచురించాల్సి ఉంటుంది. వినియోగదారులకు.. కొత్త నిబంధనల ప్రయోజనాలు మార్చి 1 నుంచి లభించనున్నాయి. ట్రాయ్‌  కొత్త టారిఫ్‌ ఆర్డరు ప్రకారం..

Video Advertisement

 


End of Article

You may also like