Ads
ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో రాధే శ్యామ్ సినిమా రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Video Advertisement
రాధే శ్యామ్ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించనున్నారు. అలా అని ఇది బయోపిక్ కాదు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలోని నగుమోము తారలే సాంగ్ ఇవాళ విడుదల అయ్యింది. ఈ పాట తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో ఒక వెర్షన్, హిందీ లో ఒక వెర్షన్ ఉంది. తెలుగు పాటని సిద్ శ్రీరామ్ పాడారు. అయితే, ఈ పాటలో ఒకటి గమనిస్తే ఇందులో ఒక షాట్ లో పూజా హెగ్డే, ప్రభాస్ బైక్ మీద వెళ్తూ ఉంటారు. అందులో జూమ్ చేసి చూస్తే, ఆ సీన్ లో ఉన్నది పూజా హెగ్డేలాగా అనిపించట్లేదు. అందులో ఉన్నది పూజా హెగ్డే డూప్ అని మనకి అర్థమైపోతుంది.
మాములుగా ఈ సినిమా బృందం తరచుగా ఎదో ఒక విషయం మీద సోషల్ మీడియాలో చర్చల్లో నిలుస్తూనే ఉంటారు. ఒక సారి సినిమా రిలీజ్ గురించి, ఇంకొకసారి పాటలు, లేదా ఇంకా ఏమైనా విడుదల చేస్తాం అని ఒక డేట్, టైం చెప్పి తర్వాత ఆ టైంకి విడుదల చెయ్యకపోవడం గురించి, ఇలా చాలా సార్లు ట్రోలింగ్ కి గురయ్యారు. ఈ సారి ఈ సీన్ కారణంగా మళ్ళీ చర్చల్లో నిలిచారు. సాధారణంగా ఏదైనా రిస్కీ సీన్ షూట్ చేస్తున్నప్పుడు డూప్ వాడడం అనేది సహజం. కానీ ఈ సీన్ మామూలుగానే ఉన్నట్టు మనకి తెలుస్తోంది. దాంతో, “ఆ సీన్ లో ఏముందని డూప్ పెట్టి షూట్ చేసారు?” అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
watch video :
End of Article