అప్పుడు “సుకుమార్” మహేష్ కి చెప్పింది “పుష్ప” కథేనా.? మహేష్ అందుకే “నో” చెప్పారా.?

అప్పుడు “సుకుమార్” మహేష్ కి చెప్పింది “పుష్ప” కథేనా.? మహేష్ అందుకే “నో” చెప్పారా.?

by Mohana Priya

Ads

పుష్ప సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇది అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. సినిమాకి సంబంధించి ప్రతి చిన్న విషయంలో అల్లు అర్జున్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక ఎర్ర చందనం ఎగుమతి చేసే వ్యక్తిగా కనిపిస్తారు.

Video Advertisement

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. వీళ్లు మాత్రం కాదు సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్, ఇంకా చాలా మంది ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప రెండు భాగాలుగా విడుదల అవుతుంది అనే విషయం తెలిసిందే.

did sukumar narrated same story to mahesh babu first

ఇదిలా ఉండగా సడెన్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు 3సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. భరత్ అనే నేను విడుదలైన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ తో మహేష్ బాబు ఒక సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. దాంతో మళ్లీ 1 తర్వాత అలాంటి యాక్షన్ థ్రిల్లర్ ఒకటి రాబోతోంది అని సంతోషపడ్డారు. కానీ కొద్ది రోజుల తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయినట్టు మహేష్ బాబు ప్రకటించారు.

did sukumar narrated same story to mahesh babu first

ఇప్పుడు, “మహేష్ కి బహుశా అప్పుడు సుకుమార్ వినిపించింది పుష్ప కథేనేమో” అనే వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబుకి కథ అంత పెద్దగా నచ్చకపోవడంతో, మహేష్ ఈ సినిమా కాదు అనడంతో, ఇదే కథని అల్లు అర్జున్ కి వినిపించినట్లు సమాచారం. అల్లు అర్జున్ కి కథ నచ్చడంతో, కొన్ని మార్పులు చేసి ఈ కథని ఇంకా బాగా రాసుకొని పుష్ప సినిమా మొదలుపెట్టారట. కొంతమంది ఇలా అంటూ ఉంటే, ఇంకా కొంతమందేమో, “మహేష్ కి చెప్పిన కథ వేరే. అల్లు అర్జున్ కి చెప్పిన కథ వేరే” అని అంటున్నారు. కొంతమందేమో, “మహేష్ బాబు సరైన నిర్ణయం తీసుకున్నారు” అని అంటున్నారు. ఇందులో ఉన్న నిజమెంతో సుకుమార్ కి మాత్రమే తెలియాలి.


End of Article

You may also like