Ads
భారతదేశం అంతా కూడా ఎప్పుడెప్పుడ అని ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు స్నేహం, వారి కష్టాలు ఇలాంటివన్నీ కూడా మనం ట్రైలర్ లో చూసాము. అలానే బ్రిటిష్ వాళ్ళతో ఎలా పోరాడారు అనేది కూడా ఆ ట్రైలర్ లో చూపించారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా అలియాభట్, ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు.
Video Advertisement
శ్రియ శరణ్ తో పాటుగా కొంత మంది ఇంగ్లీష్ నటులు కూడా ఈ సినిమాలో నటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 7న సినిమా విడుదల అవుతుందని అన్నారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా సినిమాను వాయిదా వేశారు. దీంతో ఏప్రిల్లో సినిమా విడుదల అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడడంతో ఈ సినిమా విడుదల ప్రతిష్టాత్మకంగా తీసుకుంది చిత్ర యూనిట్. దీంతో ఈ సినిమా ప్రచారానికి చిత్రబృందం చాలా కష్టపడిందని చెప్పాలి. పైగా భారీ ఖర్చు కూడా పెట్టిందట. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు రాజమౌళి అలియా భట్ కూడా పాల్గొన్నారు. అనేక ఛానళ్లలో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు.
కపిల్ శర్మ షో లో కూడా ప్రమోషన్ చేశారు. హిందీ బిగ్ బాస్ లో కూడా సినిమా ప్రమోషన్లు చేయడం జరిగింది. అయితే ఇలా ప్రమోషన్ల కోసం ఏకంగా నిర్మాతలు 18 నుండి 20 కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. ఈ సినిమా ప్రమోషన్ చేసిన డబ్బులతో ఒక సినిమా చేసేయొచ్చు అని సినిమా విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా వాయిదా పడటంతో చిత్రబృందం కూడా నిరాశకు గురైంది.
End of Article