Ads
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లైగర్. ఈ సినిమాతో అనన్య పాండే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ సినిమా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. సినిమా బృందం అంతా కూడా ప్రమోషన్స్ పనిలో ఉన్నారు.
Video Advertisement
సినిమా గురించి ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి సినిమాపై క్రేజ్ మొదలైంది. ఇది విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియన్ సినిమా. పాన్ ఇండియన్ స్థాయిలో క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండలాంటి నటుడి సినిమా పాన్ ఇండియన్ సినిమాగా వస్తోంది అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం సినిమా బృందం అంతా కూడా ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉన్నారు. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే ఎన్నో ప్రదేశాలకు వెళుతూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. గుజరాత్, పూణే, ఇంకా ఎన్నో ప్రదేశాలకు వీరిద్దరూ వెళ్లారు. మీరు వెళ్లిన ప్రతిచోట కూడా ఎంతోమంది వీళ్ళని చూడటానికి వచ్చారు. ప్రస్తుతం ఈ విషయంపై చర్చ జరుగుతోంది. అందుకు కారణం వీరిద్దరూ అంత గొప్ప పేరున్న నటులు ఏమీ కాదు.
విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించిన మాట నిజమే. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని వేలల్లో జనం వస్తున్నారు. ఇంక అనన్య పాండే విషయానికి వస్తే, అనన్య పాండే నటించిన 4 సినిమాలు కూడా సాధారణమైన సినిమాలే. అందులో ఒక సినిమా తప్ప మిగిలినవి ఏవీ కూడా అంత చెప్పుకోదగ్గ హిట్ ఏమీ అవ్వలేదు. పూరి జగన్నాధ్ కి మన దగ్గర క్రేజ్ ఉంది. అలాగే బాలీవుడ్ లో కూడా ఉంది. కానీ మిగిలిన చోట్ల స్టార్ డైరెక్టర్ అని తెలిసే అవకాశాలు తక్కువ.
అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతమంది జనం వస్తున్నారు అంటే, జనం ఎక్కువ ఉండడంతో ఈవెంట్ మధ్యలో ఆపేసి వెళ్ళిపోతున్నారు. ఒకటి రెండు చోట్ల అంటే అనుకోవచ్చు, కానీ ప్రతి చోట ఇలాగే ఉండడంతో ఈ విషయంపై చాలా కామెంట్స్ వస్తున్నాయి. దాంతో ఇప్పుడు అయితే ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ ప్రమోషన్ సమయంలో వచ్చే జనాలు అందరు కూడా పబ్లిసిటీ స్టంట్ అని, ఇదంతా ప్రమోషన్స్ లో ఒక భాగం అని, వాళ్లు నిజంగా వీళ్ళని చూడడం కోసం వచ్చే జనాలు కాదు అనే వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాలో భాగం అయిన కారణంగా ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ అన్నీ చేయిస్తున్నారు అని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం తెలియదు.
End of Article