Ads
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. ప్రస్తుతం భారతీయ సినీ ఇండస్ట్రీలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలలో ప్రభాస్ ఒకరు. ఇటీవల రిలీజ్ అయిన ‘ఆదిపురుష్’ చిత్రంకు ప్రభాస్ 150 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్.
Video Advertisement
నేషనల్ వైడ్ గా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ పై ఇన్వెస్ట్ చేయడానికి పెద్ద నిర్మాతలు కూడా వెనకాడడం లేదు. కేజీఎఫ్ నిర్మించిన హోంబలే ఫిలింస్ ప్రభాస్ హీరోగా ‘సలార్’ సినిమాని నిర్మిస్తోంది. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్తో ప్రభాస్ హీరోగా ‘ప్రాజెక్ట్ K’ మూవీని రూపొందిస్తోంది. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఒక వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్ బాహుబలి తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. సినిమాల ఫలితం ఎలా ఉన్నప్పటికీ, వాటి తో సంబంధం లేకుండా సినిమాల ద్వారా భారీగా సంపాదిస్తున్నారని టాక్. ప్రభాస్ తను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని విదేశాల్లో పెట్టుబడిగా పెడుతున్నారని వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటలీలో లగ్జరీ విల్లాను ఇదివరకే కొనుగోలు చేశారట.
ప్రభాస్ సినిమాల షూటింగ్ కి గ్యాప్ వచ్చిన సమయంలో ఇటలీలోని విల్లాలో తన క్లోజ్ ఫ్రెండ్స్తో కలిసి సమయం గడుపుతున్నారట. ఇక ప్రభాస్ షూటింగ్ లతో బిజీగా ఉన్నప్పుడు ఆ విల్లా ఖాళీగా ఉంటుంది. అందువల్ల దానిలో కొంత భాగాన్ని అద్దెకిస్తున్నారట. ఇటలీకి వచ్చే ట్రావెలర్స్, స్థానికంగా ఉండే వారికి విల్లాను అద్దెకు ఇస్తూ, నెలకు నలబై లక్షల వరకు సంపాదిస్తున్నాడు అని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆదిపురుష్ తరువాత మరో పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల అవడానికి రెడీ అవుతోంది. ఇదే కాకుండా ప్రభాస్ ప్రాజెక్ట్ కే, రాజా డీలక్స్, స్పిరిట్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్నారు.
Also Read: ఆ రోజు జరిగిన గొడవలో అమ్మాయిదే తప్పు.. హీరో నాగ శౌర్య
End of Article