Ads
హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. అందువల్ల హర్రర్, సస్పెన్స్, థ్రిల్లిర్ జానర్ లో సినిమాలు తరచుగా వస్తుంటాయి. ఈ చిత్రాలలో ఎక్కువశాతం సినిమాలు బాక్సాపీస్ దగ్గర హిట్ అయినవే ఉంటాయి.
Video Advertisement
ఇటీవల హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘అశ్విన్స్’ అనే సినిమా రిలీజ్ అయ్యింది. తెలుగు, తమిళంలో ద్విభాషా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో ‘తారామణి’ మూవీ యాక్టర్ వసంత్ రవి, విమలా రామన్ ప్రధాన పాత్రలలో నటించారు. గత నెల రిలీజ్ అయ్యి, ఆకట్టుకున్న ఈ మూవీ రీసెంట్ గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. తరుణ్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మూవీ ‘అశ్విన్స్’. ఈ మూవీని విరూపాక్ష ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై నిర్మించాడు. ఈ మూవీ కథ విషయానికి వస్తే అర్జున్ (వసంత్ రవి), రీతూ (సరస్వతి మీనన్) ఇద్దరు భార్యభర్తలు. వీరు ముగ్గురు ఫ్రెండ్స్ రాహుల్, వరుణ్, గ్రేస్ తో కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్ నడుపుతుంటారు. ఈ ఐదుగురు యూట్యూబర్స్ డార్క్ టూరిజం పైన ఒక ఎపిసోడ్ను షూట్ చేయడం కోసం లండన్లో ఒక దీవిలో ఉండే బంగ్లాలోకి వెళ్తారు.
ఆ బంగ్లాలో ఫేమస్ ఆర్కియాలజిస్ట్ అయిన ఆర్తి రాజగోపాల్(విమలా రామన్) ఆత్మ ఉందని, అక్కడి వెళ్లిన 15 మందిని చంపిందనే ప్రచారం ఉంటుంది. అర్జున్ టీమ్, ఆ బంగ్లాలో తిరిగే ఆత్మలను, అరుపులను కెమెరాలో బంధించడానికి ప్రయత్నిస్తారు. వారికి ఆ బంగ్లాలో ఎదురయ్యే అనూహ్య పరిణామాలు ఏంటి? ఆర్తి రాజగోపాల్ ఎలా మరణించింది? అసలు ఆ బంగ్లాలో ఏముంది? అశ్వినీ దేవతలు ప్రసాదించిన బొమ్మలు కనుగొన్న ఆర్తి రాజగోపాల్ కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తనవాళ్లను రక్షించుకోవడం కోసం అర్జున్ ఏం చేశాడు? అనేది ‘ఆశ్విన్స్’ కథ.
మంచి, చెడు రెండింటినీ నియంత్రించే శక్తి మనిషికి మాత్రమే ఉందనే మెసేజ్ ను ఈ మూవీ ద్వారా దర్శకుడు చూపించారు. దర్శకుడు తరుణ్ తేజ సెలెక్ట్ చేసుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా, దానిని స్క్రీన్ పై చూపించడంలో కాస్త తడబడ్డాడు. అశ్విన్స్ మూవీ హారర్ మరియు మైథాలజీ కలిపి తెరకెక్కించిన ఒక డిఫరెంట్ సినిమా. హారర్ సినిమాలను ఇష్టపడేవారిని ఈ మూవీ ఆకట్టుకుంటుంది.
Also Read: “అణుబాంబు” తయారుచేసిన సైంటిస్ట్ కి భగవద్గీతతో ఉన్న సంబంధం ఏంటి..? అసలు ఈ వివాదం ఏంటి..?
End of Article