“సాయి ధరమ్ తేజ్” తో ఉన్న హీరోను గుర్తు పట్టారా..? ఇలా మారిపోయాడేంటి?

“సాయి ధరమ్ తేజ్” తో ఉన్న హీరోను గుర్తు పట్టారా..? ఇలా మారిపోయాడేంటి?

by kavitha

Ads

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘బ్రో’ తో ఆకట్టుకున్నాడు. యాక్సిడెంట్ నుండి కోలుకున్న తరువాత చేసిన రెండు చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం బ్రో మూవీ సక్సెస్ సెలబ్రేషన్ వేడుకల్లో పాల్గొంటూనే, తన స్నేహితులతో కలిసి నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ కోసం సిద్ధం అవుతున్నాడు.

Video Advertisement

ఫ్రెండ్స్ తో కలిసి ఉన్న సాయిధరమ్ తేజ్ ఫోటోలు రెండు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే సాయిధరమ్ తేజ్ తో  పాటుగా ఈ ఫోటోలో ఉన్న మరొక వ్యక్తి ఇండస్ట్రీకి చెందిన, ప్రముఖ నటుడి కుమారుడిలా కనిపించాడు. ఆ వ్యక్తి ఎవరో? ఆ ప్రముఖ నటుడు ఎవరో ఇప్పుడు చూద్దాం..‘బ్రో’ మూవీ తరువాత సాయిధరమ్ తేజ్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక మూవీ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ‘గాంజా శంకర్’ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా కన్నా ముందుగా సాయిధరమ్ తేజ్ ఒక షార్ట్ ఫిల్మ్‌తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. సాయిధరమ్ తేజ్ చాలా కాలం క్రితమే ‘సత్య’ అనే షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేశాడు.
ఈ షార్ట్ ఫిల్మ్‌ కి యాక్టర్ సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ డైరెక్షన్ చేశాడు. నవీన్ నందిని నర్సింగ్ హోమ్, ఐనా ఇష్టం నువ్వు, ఊరంతా అనుకుంటున్నారు అనే చిత్రాలలో హీరోగా నటించాడు. వీటిలో ఐనా ఇష్టం నువ్వు మూవీ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం. అయితే నవీన్ నటించిన సినిమాలు విజయం సాధించలేదు. దాంతో నటనకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతను గుర్తు పట్టలేనంతగా, లావుగా మారిపోయారు. ఇక వైరల్ అవుతున్న సాయిధరమ్ తేజ్ ఫోటోలో అతని పక్కన నలుపు రంగు టీషర్ట్‌లో ఉన్నది నవీన్. అతను లావుగా మారడంతో వెంటనే గుర్తుపట్టలేకపోయారు. ఇది ఇలా ఉంటే మంచు మనోజ్, నవీన్, సాయితేజ్ మంచి స్నేహితులు. వీలు దొరికినపుడల్లా ఈ ముగ్గురు కలుస్తుంటారని తెలుస్తోంది. నవీన్ హీరోగా సక్సెస్ కాలేకపోయినా, డైరెక్టర్ గా మారిపోయాడు. ఈ షార్ట్ ఫిల్మ్ త్వరలో విడుదల కానుంది అని తెలుస్తోంది.

Also Read: “తల ఏదో తేడాగా ఉందేంటి..?” అంటూ… చంద్రముఖి-2 నుండి “రాఘవ లారెన్స్” పోస్టర్‌పై 15 ట్రోల్స్..!


End of Article

You may also like