అసలు ఏం జరిగింది..? ఎందుకు ఈ గొడవ..?

అసలు ఏం జరిగింది..? ఎందుకు ఈ గొడవ..?

by kavitha

Ads

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్’ మూవీ ఆగస్ట్ 11 న రిలీజ్ కానుంది. ఈ మూవీలో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా, ప్రొడ్యూసర్ అనిల్ సుంకర నిర్మించాడు.

Video Advertisement

అయితే రెండు రోజుల‍్లో ‘భోళా శంకర్’ విడుదల కానుండగా, ఒక డిస్ట్రిబ్యూటర్ ఈ మూవీ రిలీజ్ ను ఆపాలని కోర్టుకి వెళ్లాడు. ‘భోళా శంకర్’ ప్రొడ్యూసర్ల పై కేసు పెట్టాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది.  అసలు ఏం జరిగింది? ఈ గొడవ ఎందుకు? అనేది ఇప్పుడు చూద్దాం..
comments on this point in bholaa shankar teaserభోళా శంకర్ మూవీ నిర్మాత అనిల్ సుంకర ‘ఏజెంట్’ మూవీని నిర్మించారు. యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన ఈ మూవీ ఏప్రిల్ 27న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.  దాంతో ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, బయ్యర్లకి భారీ నష్టాలు వచ్చాయి. అయితే ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు ముప్పై  కోట్లు తీసుకుని మోసగించారని వైజాగ్ కు చెందిన డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ వారి పై కోర్టులో కేసును వేశారు. ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.జెంట్ మూవీకి విశాఖపట్నం జిల్లా వరకే డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇచ్చి, అగ్రిమెంట్ ను బ్రేక్ చేశారు. మే 1న ఇదే  విషయం గురించి గరికపాటి కృష్ణ కిశోర్‌ని కలవగా, అతను నిర్మాత అనిల్ సుంకరతో మాట్లాడారని, ఏజెంట్ డిజాస్టర్ గా నిలిచిందని, అండర్ టేకింగ్ లెటర్ కూడా ఇస్తామని అన్నారు. ఆ తరువాత ‘సామజవరగమన’ విశాఖపట్నం హక్కులు తనకే ఇచ్చినా, నష్టపోయిన డబ్బులో కొంచెం మాత్రమే వచ్చిందని అన్నారు.
నలబై ఐదు రోజుల్లో లేదా నెక్స్ట్ రిలీజ్ కు 15 రోజుల ముందు మిగతా డబ్బును చెల్లిస్తామని అగ్రిమెంట్ ఇచ్చారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నెక్స్ట్ సినిమా ‘భోళా శంకర్’ గురించి మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే వారు తనకు జవాబు చెప్పట్లేదు. ఫిలిం ఛాంబర్ కు చెప్పిన ఎలాంటి ప్రయోజనం కలుగలేదని, తప్పని పరిస్థితుల్లోనే కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని బత్తుల సత్యనారాయణ చెప్పుకొచ్చారు.

Also Read: “జైలర్‌” మూవీలో విలన్‌గా భయపెట్టిన ఈ నటుడు ఎవరో తెలుసా..?


End of Article

You may also like