Home News నాకు కరోనా లక్షణాలు ఉన్నాయి…ఆసుపత్రి కి ఫోన్ చేస్తే పట్టించుకోవట్లేదు అంటూ సీరియల్ నటి ఆవేదన.!

నాకు కరోనా లక్షణాలు ఉన్నాయి…ఆసుపత్రి కి ఫోన్ చేస్తే పట్టించుకోవట్లేదు అంటూ సీరియల్ నటి ఆవేదన.!

by Megha Varna

రోజురోజుకి కరోనా వైరస్ విజృంభిస్తుంది.కేసు లు తగ్గాయి అనుకొనేలోపు మళ్ళీ కొత్త కేసు లు నమోదు అవుతున్నాయి.అగ్రరాజ్యాలతో పాటు భారత్ కూడా కరోనా దాటికి తట్టుకోలేకపోతుంది.అయితే ఈ నేపథ్యంలో నాకు కరోనా లక్షణాలు ఉన్నాయి అంటూ  సీరియల్ నటి చార్వీ సరాఫ్  రాసిన లేఖ సంచలనం గా మారింది.ఆ వివరాలేంటో చూద్దాం.

“కసౌటి జిందగీ” అనే సీరియల్ ద్వారా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న చార్వి సరఫ్ తనకి కరోనా లక్షణాలు ఉన్నాయి అంటూ స్పష్టంగా ఒక లేఖ రాసారు.కాగా ఇప్పుడు ఈ వార్త మీడియాలో సంచలనంగా మారింది.నా ఆరోగ్యం బాగోలేదు,తల నొప్పి ,జ్వరం ,జలుబు దగ్గు ఉన్నాయని ఓ లేఖ ద్వారా తెలిపారు చార్వి సరఫ్.అయితే ప్రభుత్వ ఆసుపత్రి కి ఫోన్ చేస్తే ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోయారు చార్వి సరఫ్.

కరోనా టెస్ట్ కిట్స్ లేవు అని ప్రభుత్వ ఆసుపత్రి వారు చెప్తున్నారని చార్వి సరఫ్ అన్నారు.అయితే నిత్యావసరాలకు తప్పితే బయటకు రావడంలేదని ఎప్పుడూ గృహ నిర్బంధంలోనే ఉంటున్నాని చార్వి సరఫ్ తెలిపారు.ఒక సెలెబ్రెటీ అయ్యి నా పరిస్థితే ఇలా ఉంటె ఇంక సామాన్యుల పరిస్థితి ఎలా  ఉందొ అర్ధంచేసుకోవచ్చని చార్వి సరఫ్ తన లేఖ ద్వారా తెలిపారు.పరిస్థితి ఇలా ఉంటె ప్రభుత్వాలు కరోనా పై ఎలా పోరాటం చేస్తాయని ప్రశ్నించారు చార్వి సరఫ్.

 

View this post on Instagram

 

The reason why I was inactive on social media for some time. You people might want to read this.

A post shared by Charvi Saraf (@sarafcharvi) on

 

You may also like