Home News గ్యాంగ్‌స్టర్‌ ఎన్ కౌంటర్

గ్యాంగ్‌స్టర్‌ ఎన్ కౌంటర్

by Megha Varna

ఉత్తరప్రదేశ్‌లో 8 మంది పోలీసుల పై కాల్పులు జరిపి దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ను పట్టుకోవడం కోసం పోలీసులు 40 బృందాలు ఏర్పాటు చేసుకొని ఉత్తరప్రదేశ్‌ అంతా గత కొద్దిరోజులుగా జల్లెడ పడుతున్నారు.

 

తాజాగా ఉజ్జయిని ప్రాంతంలో గురువారం వికాస్‌
దూబే పోలీసులకు పట్టుబడ్డాడు.దానితో అతన్ని
ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా పోలీసుల ఎస్కార్ట్‌లోని ఓ వాహనం బోల్తా పడింది. దీనిని అదునుగా తీసుకున్న వికాస్‌ పారిపోయేందుకు ప్రయత్నించడమే గాక పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో ఇరువర్గాలకు మధ్య జరిగిన కాల్పుల్లో పోలీసులు వికాస్‌ ను ఎన్ కౌంటర్ చేశారు.

You may also like