Home News వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్

by Megha Varna

కరోనా ఎవరిని వదలట్లేదు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరిని పట్టి పీడిస్తుంది. ఈ కారణాలతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళు బయట తిరిగే వాళ్ళు అని తేడా లేకుండా అందరి పై తన కోరలు చాచుతుంది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది ఈ.అతనెవరో కాదు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈయన జగన్ కు అత్యంత సన్నిహితుడు. వైసీపీ అధికారంలోకి రావడానికి ఈయన ఎంతో కృషి చేశాడు.అలాంటి ఈయనకు కరోనా పాజిటివ్ రావడంతో పార్టీ శ్రేణులలో ఆందోళన వాతావరణం నెలకొంది. విజయసాయి రెడ్డి త్వరగా కరోనా నుండి కోలుకోవాలని జగన్ అభిమానులు మరియు పార్టీ నాయకులు కోరుతున్నారు.

You may also like