Ads
ఈ సంవత్సరం కూడా కరోనా కారణంగా ఎన్నో సినిమాలు విడుదల అవకుండా ఆగిపోయాయి. కొన్ని డైరెక్ట్ డిజిటల్ అవ్వగా, రిలీజ్ కొన్ని మాత్రం థియేటర్లు తెరిచేంత వరకు ఎదురు చూసి థియేటర్లలోనే విడుదల అయ్యాయి. కొన్ని సినిమాలు మాత్రం విడుదలను వాయిదా వేసుకున్నాయి. ఆ జాబితాలో ఇప్పుడు ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రాధే శ్యాం కూడా చేరింది. ఈ సినిమా అసలు జూలై 30 వ తేదీన విడుదల కావలసి ఉంది. కానీ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు సినిమా బృందం ప్రకటించింది. అంతే కాకుండా ఇవాళ సినిమా కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించింది.
Video Advertisement
రాధే శ్యాం సినిమా జనవరి 14 వ తేదీన 2022 లో సంక్రాంతి సందర్భంగా రాబోతోంది. అయితే సంక్రాంతికి ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా రవితేజ హీరోగా వస్తున్న రామారావు ఆన్ డ్యూటీ, విజయ్ హీరోగా నటించిన బీస్ట్, అంతే కాకుండా వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్ 2 కి సీక్వెల్ అయిన ఎఫ్ 3 కూడా సంక్రాంతికి విడుదల అవుతాయి అని సమాచారం. దాంతో ఈ సినిమాలు అన్నీ సంక్రాంతికి రాబోతున్నాయని సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
End of Article