Ads
విశాఖపట్నంలో జరిగిన ఘటన ప్రస్తుతం చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, సాక్షి కథనం ప్రకారం, భార్గవి అనే ఒక యువతి తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఇవాళ భార్గవి తను ప్రేమించిన యువకుడిని సింహాచలంలో పెళ్లి చేసుకుంది. శుక్రవారం పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన భార్గవి తన ప్రేమ గురించి తన తల్లిదండ్రులకి తెలియదు అని చెప్పింది.
Video Advertisement
కానీ ఇప్పుడు మాత్రం తన ప్రేమని తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అని చెప్పింది. అందుకే తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది. భార్గవి మేజర్ కావడంతో పోలీసులు తన నిర్ణయానికే వదిలేశారు. తన తల్లిదండ్రులు ఏమనుకున్నా పర్వాలేదు అని, తాను మాత్రం తనకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అని భార్గవి చెప్పింది.
watch video :
End of Article