Home Filmy Adda “దూకుడు” టైం లో జరిగిన ఆ సంఘటన వల్ల “సమంత” షాక్ నుండి తేరుకోలేకపోయిందంట.?

“దూకుడు” టైం లో జరిగిన ఆ సంఘటన వల్ల “సమంత” షాక్ నుండి తేరుకోలేకపోయిందంట.?

by Sunku Sravan

ఏ మాయ చేసావే సినిమా ద్వారా వెండి తేర కి పరిచయం అయిన ‘సమంత’. తను నటించిన మొదటి సినిమా సాధించిన విజయం తోనే ప్రేక్షకుల మనసుని మాయ చేసి మనసులని దోచేశారు సామ్. టాలీవుడ్ లోని స్టార్ హీరోల సరసన నటించిన సమంత. సౌత్ ఇండియా ని రూల్ చేసారు. అక్కినేని వారసుడు ‘నాగ చైతన్య’ ని పెళ్లి చేసుకున్న సామ్.

srinuvaitla-about-samantha

srinuvaitla-about-samantha

 

పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. ఏ మాయ చేసావే, బృందావనం వంటి హిట్ సినిమా ల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించారు సామ్ ‘దూకుడు’ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సమంత. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు దర్శకులు శ్రీనువైట్ల. సరిగ్గా పది సంవత్సరాలను పూర్తి చేసుకున్న ‘దూకుడు’. శ్రీను వైట్ల సామ్ గురించి చెబుతూ ఈ సినిమా ఇస్తాంబుల్ లో కొంత భాగాన్ని అక్కడ చిత్రీకరించిన సంగతి తెలిసిందే.

dookudu movie stills

dookudu movie stills

షూటింగ్ కి ఒక రోజు సెలవు రావడంతో సమంత ని షాపింగ్ కి వెళ్ళమని సూచించారట. అలా సమంత షాపింగ్ చేసిన తరువాత పదినిమిషాలకి అక్కడ  ఆత్మాహుతి దాడి జరిగిందట. ఈ విషయాన్ని దర్శకులు శ్రీను వైట్ల గారికి చెబుతూ ఏడ్చేసిందట, ఆ షాక్ నుంచి తేరుకోలేక పోయిందని చెప్పుకొచ్చారు.

dookudu movie stills

dookudu movie stills

తొలిసారి భూకంపాన్ని సైతం చూశానని చెప్పారు పెద్ద హోటల్ లో 36వ అంతస్తులోని రూమ్ లో పడుకోగా అంతా ఊగినట్టు అనిపించిందని అన్నారు. అలాగే ఇస్తాంబుల్ నుంచి ఇండియా కి వచ్చే సమయంలో పాస్ పోర్ట్ లు మిస్ అయ్యాయని కూడా చెప్పారు.సమంత తన తదుపరి సినిమా ‘శాకుంతలం’ త్వరలో విడుదల కానుంది శ్రీను వైట్ల ప్రస్తుతం ఢీ అంటే ఢీ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

You may also like