Ads
సాధారణంగా పెళ్ళంటే కొన్ని రకాల సంప్రదాయాలు ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా భారతదేశం అంటే ఇంకా ఎన్నో రకాల సంప్రదాయాలు ఉంటాయి. అయితే కొంత మంది మాత్రం కొన్ని సాంప్రదాయాలకు భిన్నంగా చేసి చర్చ లో ఉంటూ ఉంటారు. అయితే ఇటీవల ఒక యువతి కూడా ఇలాగే తన పెళ్లి లో చేసిన ఒక వింత పనితో వైరల్ అయ్యారు.
Video Advertisement
వివరాల్లోకి వెళితే పూనేలోని పింప్రీ చిన్చ్వడ్ కి చెందిన శుభాంగి అనే ఒక యువతి స్కార్పియో కార్ బానెట్ పై కూర్చొని ఫోటోలు తీయించుకున్నారు. కారు ముందుకు వెళుతూ ఉంటే ఏ మాత్రం భయపడకుండా ఫోటోలకి ఫోజులు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్ళింది. దాంతో కరోనా నిబంధనలు ఉల్లంఘించిన కారణం తో శుభాంగి పై డ్రైవర్ పై అలాగే ఫోటోగ్రాఫర్ పై కేసు బుక్ చేశారు పోలీసులు.
watch video:
End of Article