‘‘నీవు ఎలా పెళ్లి చేసుకున్నావు’’ అంటూ ప్రియుడు వధువుకు ముద్దుపెట్టి…అప్పగింతలప్పుడు హంగామా.!

‘‘నీవు ఎలా పెళ్లి చేసుకున్నావు’’ అంటూ ప్రియుడు వధువుకు ముద్దుపెట్టి…అప్పగింతలప్పుడు హంగామా.!

by Mohana Priya

Ads

సినిమాలు నిజ జీవితం నుంచి రూపొందుతాయి లేదా సినిమాలను చూసి నిజ జీవితంలో ఎంతో మంది స్ఫూర్తి పొందుతారు అనడానికి ఇటీవల జరిగిన ఒక సంఘటనే ఉదాహరణ.

Video Advertisement

సాక్షి కథనం ప్రకారం కరీంనగర్ లోని హుజురాబాద్ టౌన్ కి చెందిన దివ్య, వంశీ అనే ఒక అబ్బాయిని ప్రేమించింది. కానీ దివ్య తల్లిదండ్రులు వాళ్ల ప్రేమని ఒప్పుకోలేదు. తల్లిదండ్రులు బలవంతం చేయడం వల్లనో లేదా తల్లిదండ్రుల మాటను కాదనలేకనో దివ్య తల్లిదండ్రులు చూపించిన అబ్బాయితో పెళ్లికి ఒప్పుకుంది.

దాంతో మంచిర్యాల జిల్లా మందమర్రి కి చెందిన ప్రవీణ్ కుమార్ తో సోమవారం నాడు దివ్య పెళ్లి జరిపించారు. అప్పగింతలు అయ్యి బారాత్ జరుగుతున్న సమయంలో దివ్య ప్రేమికుడు వంశీ తాగేసి దివ్య వద్దకు వచ్చాడు. “నువ్వు ఈ పెళ్లి ఎలా చేసుకున్నావు?” అని దివ్యని అడిగాడు.

దివ్య ఇంకా ప్రవీణ్ కుమార్ వెళ్ళే కారుని అడ్డుకొని దివ్య ని కారులో నుండి బయటకు దింపి అందరి ముందు ముద్దు పెట్టాడు. అంతేకాకుండా దివ్యని తనకు అప్పగించి వెళ్లిపోవాలి అని గొడవ చేయడం మొదలుపెట్టాడు. దీంతో వంశీని అరెస్ట్ చేయించారు. పెళ్లి జరిగిన ఇంట్లో గొడవ చేయడమే కాకుండా తనపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించాడు అని వంశీ పై ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.

వంశీ ని అరెస్టు చేశారు అని తెలిసిన దివ్య పోలీస్ స్టేషన్ కి వచ్చి తను వంశీ నే ఇష్టపడుతున్నట్లు చెప్పింది. దివ్యకి, ప్రవీణ్ కుమార్ కి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా సరే దివ్య మాత్రం తన మాట మార్చలేదు.

దీంతో ప్రవీణ్ కుమార్ మందమర్రి వెళ్లిపోయారు. దివ్య తల్లిదండ్రులు కూడా దివ్య ని పోలీస్ స్టేషన్ లో విడిచి పెట్టి వెళ్ళిపోయారు. పోలీసులు దివ్య ని కరీంనగర్ లోని స్వధార్ హోమ్ కి తరలించారు. వంశీ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.


End of Article

You may also like