కోపంతో పోగు చేసిన చెత్త…కోటీశ్వరుడిని చేసింది..! వైరల్ అవుతున్న సంఘటన.!

కోపంతో పోగు చేసిన చెత్త…కోటీశ్వరుడిని చేసింది..! వైరల్ అవుతున్న సంఘటన.!

by Mohana Priya

Ads

సాధారణంగా ఇంట్లో చెత్త ఉంటేనే చాలా మందికి చిరాగ్గా ఉంటుంది. అలాంటిది ఒక వ్యక్తి ఒక దశాబ్ద కాలం చెత్త పోగు చేశాడు. అంతే కాకుండా కోటీశ్వరుడు కూడా అయ్యాడు. వినడానికే చాలా వింతగా ఉంది కదా ? వివరాల్లోకి వెళితే, సౌత్ కొరియాలోని ఒక తండ్రి తన కొడుకు పనీ పాటా లేకుండా తిరుగుతున్నాడు అని కోపం తెచ్చుకున్నాడు.

Video Advertisement

man collects garbage for ten years in south korea

అలా ఇంట్లోనే ఉండి ఆ కొడుకు దాదాపు 100 కేజీల వరకు బరువు పెరిగాడట. ఈ కోపానికి నిరసనగా ఆ  తండ్రి తన ఇంట్లో చెత్తని పోగు చేయడం మొదలు పెట్టాడు. ఆ చెత్త అలా పోగు అయ్యి ఒక దశాబ్దం గడిచింది. అలా పోగైన చెత్త వాసన వల్ల అతని భార్యకు అనారోగ్యం కలిగింది. దాంతో డాక్టర్లు వెంటనే ఆ చెత్త తొలగించాలి అని చెప్పారు.

man collects garbage for ten years in south korea

ఇంక డాక్టర్లు చెప్పడంతో చేసేదేమీ లేక తండ్రి ఇంట్లో ఉన్న చెత్త మొత్తాన్ని అమ్మేశాడు. అలా అమ్మడం ద్వారా ఆయనకు 36 కోట్ల రూపాయలు లభించాయి. ఆ చెత్త దాదాపు 150 టన్నుల బరువు ఉందట. దాంతో ఇదంతా చూసిన ఆ చుట్టుపక్కల జనమంతా “కొడుకు కోసం ఆస్తిగా ఈ చెత్తనంతా పోగు చేశాడు ఏమో” అని అన్నారట.

man collects garbage for ten years in south korea

నిజానికి, ఆ తండ్రి అలా చెత్త పోగు చేయడానికి గల కారణం ఏంటంటే, తన కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు ఆ కంపుని భరించలేక బయటికెళ్ళి ఏమైనా ఉద్యోగం చేసుకుంటాడు ఏమో అని. కానీ ఇక్కడ మాత్రం వేరే విధంగా జరిగింది. ఆ వ్యక్తి పేరు చోయి అని, ఆయనకు 75 సంవత్సరాలు అని, అలాగే వారి కొడుకుకి 40 సంవత్సరాలు అని, కొడుకు సెకండ్ ఫ్లోర్ లో ఉంటే, తల్లిదండ్రి కింద ఫ్లోర్ లో ఉంటారు అని తెలిసింది.


End of Article

You may also like