పాముకి రాఖీ కట్టమన్నాడు..! కానీ అంతలోపే.!

పాముకి రాఖీ కట్టమన్నాడు..! కానీ అంతలోపే.!

by Mohana Priya

రాఖీ పండుగ రోజు బీహార్ లో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, బీహార్ లోని సరణ్ జిల్లా మాంఝీ శీతల్‌ పూర్ లో ఒక వ్యక్తి పాములని పెంచే వాడు. ఆ వ్యక్తి తన చెల్లితో, పాముకి కూడా రాఖీ కట్టాలని, పాము కూడా వారికి సోదరుడే అని చెప్పాడు. కానీ ఆ పాముకి రాఖీ కడుతున్న సమయంలో, ఆ పాము యువకుడిని కాటు వేసింది. దాంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతనిని హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందాడు.bihar rakhi

Video Advertisement

సమయం కథనం ప్రకారం, ఆ యువకుడి పేరు మన్మోహన్ అని సమాచారం. శీతల్ పూర్ గ్రామానికి చెందిన దిగంబర్ సహా, మంజు కున్వర్ దంపతులకు నలుగురు సంతానం. వారిలో ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మాయి పేరు సులోచన. వారికి మన్మోహన్ రెండవ సంతానం. ఈ సంఘటనతో ఒక గ్రామం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి. సులోచన ఇంక తాను రాఖీ పండుగ ఎప్పటికీ సంతోషంగా జరుపుకోలేని ఏమో అని బాధపడింది.

watch video :


You may also like