“ఆ అమ్మాయి వెళ్లిపోయాక నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు..!” అంటూ… ప్రముఖ నటి “పావలా శ్యామల” కామెంట్స్..!

“ఆ అమ్మాయి వెళ్లిపోయాక నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు..!” అంటూ… ప్రముఖ నటి “పావలా శ్యామల” కామెంట్స్..!

by Megha Varna

Ads

పావలా శ్యామల అందరికీ సుపరిచితమే. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. సమయంలో వచ్చిన కథనం ప్రకారం చూసుకున్నట్లయితే… పావలా శ్యామల తాజాగా పలు కామెంట్లు చేశారు. ఈమె తెలుగు లో చాలా సినిమాలు చేసింది. అయితే ఈమె సినిమాల్లో నటించినప్పటికీ ఈమె స్థితి మాత్రం బాలేదు. కూతురితో కలిసి ఈమె ఇప్పుడు అనాధాశ్రమంలో ఉంటోంది.

Video Advertisement

తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. దానిలో తనకు సహాయం చేస్తానని సహాయం చేయలేదని పావలా శ్యామల చెప్పింది. మా అసోసియేషన్లో ఈమెకి మెంబర్షిప్ ఉంది.

చిరంజీవి ఒక లక్ష రూపాయలు కట్టి ఈమెకి మెంబర్షిప్ ని ఇప్పించారట అలానే ఆమె కూతురు వైద్యం కోసం రెండు లక్షల రూపాయలు చిరంజీవి ఇచ్చారని పావలా శ్యామల అంది. అయితే ఆ డబ్బులు అయిపోయాయని ఆమె అంది. ఇదిలా ఉంటే కరాటే కళ్యాణి తనకి సహాయం చేస్తానని వచ్చారని కానీ తన కూతురు అనారోగ్య సమస్య వలన గదంతా వాసన రావడంతో కళ్యాణిని చీదరించుకుంది అని ఈమె చెప్పింది. అయితే అనారోగ్య సమస్యతో మంచి కూతురు ఉంటే ఇల్లు శుభ్రంగా ఎలా ఉంటుందంటూ పావలా శ్యామల తన బాధని పంచుకుంది. మొదట మంచు విష్ణు సహాయం చేస్తానని చెప్పినా తర్వాత మాత్రం పట్టించుకోలేదని ఆమె చెప్పింది.

తనకు సహాయం చేయడం కోసం ఒక అమ్మాయిని పెట్టారట కానీ ఆ అమ్మాయి ఆపరేషన్ చేయించుకోమని చెబుతోందట. అయితే పావలా శ్యామలకి డాక్టర్లు మాత్రం శరీరం ఆపరేషన్ కి తట్టుకోలేదని పావలా శ్యామల కూతురుకి ఆపరేషన్ చేయమని చెప్పారట. ఈ విషయాన్ని శ్యామల ఆ అమ్మాయికి చెప్పగా ఆమె కి కోపం వచ్చి ఇక నుండి నాకు ఏమి సంబంధం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు తనకి ఎవరూ సహాయం చేయడం లేదని ఆమె బాధ పడుతోంది. ఇంటర్వ్యూ లో ఈ విషయాలను పావలా శ్యామల చెప్పి కన్నీరు పెట్టుకుంది.


End of Article

You may also like