ఈ సెలబ్రిటీ జంట కథ తెలుసా..? వీరి ప్రేమ ఎలా మొదలయ్యింది అంటే..?

ఈ సెలబ్రిటీ జంట కథ తెలుసా..? వీరి ప్రేమ ఎలా మొదలయ్యింది అంటే..?

by kavitha

Ads

సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వారిలో చాలావరకు  మనస్పర్ధలతో, బేధాభిప్రాయాలతో కొన్నేళ్ళకి విడిపోయినవారు ఉన్నారు. అలాంటి జంటలలో సీనియర్ హీరోయిన్ రాధిక, ప్రతాప్ బోతన్ జంట కూడా ఒకటి.

Video Advertisement

స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలోనే నటి రాధిక, నటుడు, డైరెక్టర్ అయిన ప్రతాప్ పోతన్ ను ప్రేమించి, వివాహం చేసుకుంది. అయితే ఈ జంట ఏడాదిలోపే విడపోయారని తెలుస్తోంది. రాధిక, ప్రతాప్ పోతన్ ప్రేమకథ గురించి ఇప్పుడు చూద్దాం.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధిక తన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అనేక తెలుగు చిత్రాలలో హీరోయిన్ గా నటించి, మెప్పించింది. ఎన్టీఆర్, ఆకకఎనేని నాగేశ్వర రావు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి అగ్ర హీరోలతో నటించింది. ఆమె తమిళ ఇండస్ట్రీలో అనేక చిత్రాలలో నటించారు. 1985లో రిలీజ్ అయిన తమిళ చిత్రం ‘మీందుం ఓర్ కాదల్ కతి’. ఈ చిత్రానికి మొదటిసారిగా ప్రతాప్ బోతన్ డైరెక్షన్ చేయగా, ఈ మూవీని రాధిక నిర్మించారు. ఈ మూవీ సమయంలోనే రాధికకు ప్రతాప్ పోతన్ తో పరిచయం ఏర్పడింది.
అంతేకాకుండా ఈ చిత్రంలో వీరిద్దరు జంటగా నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా అని అప్పట్లో వీరిద్దరి పై రూమర్స్ కూడా వచ్చాయి. వీరి ప్రవర్తన కూడా అలాగే ఉండేదని టాక్. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రేమించుకున్న ఈ జంట మధ్య సఖ్యత లేకపోవడంతో పెళ్లి చేసుకున్న ఏడాదిలోపే విడాకులు తీసుకుని విడిపోయారు.
ఆ తరువాత రాధిక ఒక బ్రిటీన్ ఇండియ‌న్‌ను వివాహం చేసుకున్నప్పటికి, అతనికి విడాకులు ఇచ్చి, ఆ త‌ర్వాత సీనియ‌ర్ హీరో శ‌ర‌త్ కుమార్‌ను మూడవ వివాహం చేసుకుంది. ఇక ప్రతాప్ పోతన్ కూడా వీరు విడిపోయిన 5 ఏళ్ళకు రెండవ పెళ్లి చేసుకున్నాడు. పన్నెండు ఏళ్ల తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు. ప్రతాప్ పోతన్ 2022లో కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూశారు.

Also Read: “భోళా శంకర్” ఇన్‌సైడ్ టాక్..! సినిమా ఎలా ఉందంటే..?


End of Article

You may also like