“మా సినిమాలో అవి నాకే నచ్చలేదు..!” అంటూ… “ఆదిపురుష్‌” పై నటుడి కామెంట్స్..! ఏం అన్నారంటే..?

“మా సినిమాలో అవి నాకే నచ్చలేదు..!” అంటూ… “ఆదిపురుష్‌” పై నటుడి కామెంట్స్..! ఏం అన్నారంటే..?

by kavitha

Ads

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌, బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్‌ జంటగా నటించిన సినిమా ‘ఆదిపురుష్‌’. ఈ మూవీ పై విమర్శలు, వివాదాలు వచ్చిన విషయం తెలిసిందే. రామాయణంను అపహస్యం చేశారని మండిపడుతున్నారు. దర్శకుడు ఓం రౌత్ ను, రచయిత మనోజ్ శుక్లాను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Video Advertisement

ఈ చిత్రంలో హనుమంతుడు చెప్పే డైలాగ్స్ ను సామాన్యుల నుండి ప్రముఖుల వరకు తప్పుబడుతున్నారు. మాస్‌ డైలాగుల పై తీవ్రంగా వ్యతిరేకత ఎదురైంది. చిత్రబృందం వాటిని మార్చింది. ఇక ఇదే విషయం పై ఆదిపురుష్ లో నటించిన ఒక యాక్టర్ తాజాగా స్పందించారు. ఆ నటుడు ఎవరో? ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్‌ శ్రీరాముడిగా నటించిన  ఆదిపురుష్ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సీతాదేవిగా కృతిసనన్‌, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ చిత్రం మొదటి నుండి విమర్శలకు గురి అవుతోంది. వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ముఖ్యంగా హనుమంతుడితో మాస్‌ డైలాగుల చెప్పించడంతో పై ఈ చిత్రం పై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.ఈ విషయం పై పలు చోట్ల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రీసెంట్ గా అలహాబాద్‌ హైకోర్టులో విచారణ జరుగగా, డైలాగ్స్ విషయంలో సెన్సార్ బోర్డ్ పై కోర్టు మండిపడింది. చిత్ర యూనిట్‌ డైలాగ్స్ ను మర్చినప్పటికి, జరగాల్సిన నష్టం జరిగింది. ఈ డైలాగుల వల్ల మూవీ పై నెగెటివిటి పెరిగింది. ఈ విషయం పై ఆదిపురుష్ సినిమాలో నటించిన యాక్టర్ లావ్‌ పజ్నీ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.ఈ మూవీలో కుంభకర్ణుడిగా నటించిన లావ్‌ పజ్నీ మాట్లాడుతూ దర్శకుడు ఏది చెప్తే ఒక నటుడు అది చేయాలి. వివాదాస్పద డైలాగ్స్ ను తొలగించినప్పటికీ, ఆ డైలాగ్స్ తనకు నచ్చలేదని, ఓ హిందువుగా ఆ  డైలాగ్స్ ను విని తాను బాధపడ్డానని వెల్లడించాడు.

Also Read: SAMAJAVARAGAMANA REVIEW : “శ్రీ విష్ణు” హీరోగా నటించిన సామజవరగమన హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like