“రామాయణం మీద ఎన్ని సినిమాలు అయినా తీయచ్చు..!” అంటూ… ప్రభాస్ “ఆదిపురుష్” డైరెక్టర్ ఓం రౌత్ కామెంట్స్..! ఏం అన్నారంటే..?

“రామాయణం మీద ఎన్ని సినిమాలు అయినా తీయచ్చు..!” అంటూ… ప్రభాస్ “ఆదిపురుష్” డైరెక్టర్ ఓం రౌత్ కామెంట్స్..! ఏం అన్నారంటే..?

by kavitha

Ads

దర్శకుడు ఓం రౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ మూవీ జూన్ 16న విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీ రాముడిగా నటించగా, కృతిసనన్ సీతాదేవిగా నటించింది. ఈ మూవీకి ఒక వైపు భారీ కలెక్షన్స్ వస్తున్నా, మరో వైపు వివాదాలు, విమర్శలు వస్తున్నాయి.

Video Advertisement

ఆదిపురుష్ మూవీ పై నిత్యం ఏదో ఒక కొత్త వివాదం తెర పైకి వస్తూనే ఉంది. అంతేకాకుండా ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ చేసే కామెంట్స్ కూడా వివాదాలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలోనే దర్శకుడు ఓం రౌత్ తాజాగా రామాయణం నేపథ్యంతో తెరకెక్కబోయే మరో చిత్రం గురించి కామెంట్స్ చేశారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
om-raut-on-nitesh-tiwari-ramayanamదంగల్, చిచోరే వంటి బాలీవుడ్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు నితేశ్ తివారి రామాయణం తెరకెక్కిస్తున్నట్టుగా ఇటీవల ప్రకటించారు. ఈ చిత్రంలో రాముడిగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, సీతగా అలియా భట్ నటిస్తున్నారని ప్రకటించారు. మిగతా పాత్రల కోసం దక్షిణాది నటినటులను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Om-Raut-2 ఒక ఇంటర్వ్యూలో ఆదిపురుష్ డైరెక్టర్ ఓంరౌత్ ని నితీశ్ తివారి తెరకెక్కించే రామాయణం గురించి అడిగారు. ఓం రౌత్ ఇలా చెప్పుకొచ్చాడు. నితేశ్ తివారి గ్రేట్ డైరెక్టర్. తనకు మంచి ఫ్రెండ్ అని అన్నారు. నితీశ్ తివారి తీసిన దంగల్ మూవీ భారతీయ అత్యుత్తమ సినిమాలలో ఒకటి అన్నారు. నితేశ్ తివారి రచనలు, డైరెక్షన్ అద్భుతంగా ఉంటుందని చెప్పారు. నితేశ్ తీయబోయే రామాయణం పై రామ భక్తుల అందరిలాగే తాను కూడా ఆ మూవీ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. శ్రీ రాముడి గురించి ఎవరైనా, ఎన్ని చిత్రాలయినా రూపొందించవచ్చు. శ్రీ రాముడి గాధను ఎంత ఎక్కువ మంది చెప్తే అంత మంచిదని అన్నారు.

Also Read: మహేష్ బాబు “యువరాజు” సినిమాతో పాటు… “రాకేష్ మాస్టర్” కొరియోగ్రఫీ చేసిన 10 సూపర్ హిట్ పాటలు..!

 


End of Article

You may also like