ప్రేమ పేరుతో వెంటపడ్డాడు… కానీ అమ్మాయి చనిపోయే స్థితికి తీసుకెళ్లాడు..! ఏం జరిగిందంటే..?

ప్రేమ పేరుతో వెంటపడ్డాడు… కానీ అమ్మాయి చనిపోయే స్థితికి తీసుకెళ్లాడు..! ఏం జరిగిందంటే..?

by Mohana Priya

Ads

హైదరాబాద్ శివారులో జరిగిన ఘటన చర్చల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే, టీవీ9 తెలుగు కథనం ప్రకారం, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న న్యూ ఎల్బీనగర్ లో, బాలబోయిన కుమార్ కుమార్తె అఖిల ఉంటున్నారు. అఖిల వయసు 22 సంవత్సరాలు. అఖిల ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మే 28వ తేదీన రాత్రిపూట తన ఇంట్లో ఉ-రి వేసుకొని తన ప్రాణాలు తీసుకున్నారు. అందుకు ప్రేమ కారణం అని తెలుస్తోంది. అఖిలని, పోరగంటి ప్రాంతానికి చెందిన అఖిల్ సాయి గౌడ్ అనే అబ్బాయి ప్రేమ పేరుతో వెంటపడ్డారు. ప్రేమ ఒప్పుకోకపోతే చచ్చిపోతాను అని బెదిరించారు.

Video Advertisement

akhila incident jeedimetla

దాంతో అఖిల, అఖిల్ ప్రేమని ఒప్పుకున్నారు. ఇంట్లో అందరితో మాట్లాడి ఈ విషయాన్ని చెప్పారు. బంధువులందరి ముందు కుటుంబ సభ్యులు కూడా అఖిల ఇష్టాన్ని ఒప్పుకున్నారు. అక్కడి వరకు బాగానే నడిచింది. ఆ తర్వాత అసలు సమస్యలు మొదలు అయ్యాయి. అఖిల్, అఖిలని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. అఖిల్ వల్ల అఖిల చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. రోడ్ మీద అఖిలని ఇబ్బంది పెట్టారు. ఫోన్ లో కూడా మాటలతో ఇబ్బంది పెట్టేవారు అని అఖిల కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం అక్కడ నివసించే వారికి, వారి బంధువులకి తెలిసింది.

దాంతో అఖిల్ ని మందలించారు. వీరి ప్రేమ కొన్ని సంవత్సరాలు నడిచింది. కానీ అఖిల్ ఆ ప్రేమని కాదు అని అన్నారు. పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. ఈ విషయం తెలుసుకున్న అఖిల బాధపడ్డారు. ఆ బాధలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. అఖిల తండ్రి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీడిమెట్ల పోలీసులు ఈ విషయం మీద దర్యాప్తు చేస్తున్నారు. అఖిల చనిపోయే ముందు ఒక ఉత్తరం రాశారు. ఆరు పేజీల వరకు ఈ లెటర్ ఉంది. ఈ లెటర్ లో, “నేను నిన్ను చనిపోయేంతవరకు గుర్తుపెట్టుకుంటాను. నువ్వు ఎప్పుడు ఒక చెడ్డ జ్ఞాపకంగానే నాకు గుర్తుంటావు. ఒక పాఠం నేర్పించావు” అని రాశారు.


End of Article

You may also like