Ads
సందీప్ రెడ్డి వంగా ఈ పేరు ఇప్పుడు ఒక సెన్సేషన్ అయిపోయింది. ఒక తెలుగువాడు బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సెన్సేషన్ సృష్టించడం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఇక్కడ అర్జున్ రెడ్డి తీసి అదే సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రూపొందించి హిట్ కొట్టాడు. వెంటనే రణబీర్ కపూర్ తో యానిమల్స్ సినిమా తీసి తాజాగా ఆ సినిమా తోటి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.
Video Advertisement
అయితే నెక్స్ట్ సందీప్ లైనర్ చూసుకుంటే ప్రభాస్ తో స్పిరిట్ సినిమా, రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాకి సీక్వెల్, నెక్స్ట్ అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమాని ప్రకటించారు. ఈ సినిమాల లైనర్ మొత్తాన్ని టి సిరీస్ సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ సినిమాలన్నింటినీ టి సిరీస్ సంస్థ నిర్మించనున్నట్లు తెలియజేసింది.
అయితే అల్లు అర్జున్ తో తీయబోయే సినిమా గురించి ఎటువంటి వివరాలు చెప్పలేదు.ఇది కూడా అనిమల్ తరహాలో సీక్వెల్స్ తో ఉండబోతుంది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమనేది ఇప్పుడప్పుడే స్పష్టంగా తెలియదు. దీనికోసం వేచి చూడాల్సిందే. అయితే అనిమల్ తినివాత సందీప్ తీసే ప్రతి సినిమా పైన అభిమానులకు అంచనాలు పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ ఏ రేంజ్ సినిమా తీస్తాడు అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సందీప్ కూడా దానికి తగ్గట్టే యానిమల్ సినిమాకి మించిన వైలెన్స్ నెక్స్ట్ సినిమాలో చూపిస్తానంటూ చెప్పుకొచ్చాడు
End of Article