“గదర్ 2” ప్రొడక్షన్ హౌజ్ పై ఫైర్ అయిన “అమీషా పటేల్”.. కారణం ఏమిటంటే..?

“గదర్ 2” ప్రొడక్షన్ హౌజ్ పై ఫైర్ అయిన “అమీషా పటేల్”.. కారణం ఏమిటంటే..?

by kavitha

Ads

పవర్ స్టార్ బద్రి మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన అమీషా పటేల్, ఆ తరువాత మహేష్ బాబుతో నాని, జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు, నందమూరి బాలకృష్ణతో పరమ వీరచక్ర సినిమాలలో నటించి ఆకట్టుకుంది. ఆ తరువాత బాలీవుడ్, పంజాబీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.

Video Advertisement

అమీషా పటేల్ తాజాగా బాలీవుడ్ మూవీ ‘గదర్ 2’లో నటించింది. ఈ చిత్రం పై అంచనాలు బాగానే ఉన్నాయి. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ మూవీ ప్రొడక్షన్ హౌజ్ పై అమీషా పటేల్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ameesha-patel-12001లో విడుదల అయిన గదర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో సన్నీ డియోల్, అమీషా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా గదర్ 2 మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే ఆఖరి షెడ్యూల్‌లో పాల్గొన్న అమీషా పటేల్ చిత్రబృందం పై ట్విట్టర్ లో షాకింగ్ కామెంట్స్ చేసింది.అమీషా పటేల్ ట్వీట్‌లో ‘సాంకేతిక నిపుణులు, కాస్ట్యూమ్ డిజైనర్లు, మేకప్ ఆర్టిస్టులు, ఇతర స్టాఫ్ కి వేతన బకాయిలు ఇవ్వలేదని, షూటింగ్ ఆఖరి రోజు చండీగఢ్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళడానికి, ఫుడ్ బిల్లులకు డబ్బు చెల్లించలేదు. యాక్టర్స్ కు, స్టాఫ్ కి కార్లను అరెంజ్ చేయలేదు. షూటింగ్ దగ్గరే ఒంటరిగా వదిలి వేశారు.అయితే జీ స్టూడియోస్ టీమ్ వెంటనే అన్ని బకాయిలను చెల్లించి, అనిల్ శర్మ ప్రొడక్షన్స్ చేసిన తప్పులను సరి దిద్దారు. సమస్యను సాల్వ్ చేసిన నీరజ్ జోషి, షరీక్ పటేల్, కబీర్ ఘోష్, నిశ్చిత్ లకు కృతజ్ఞతలు. జీ స్టూడియోస్ యూనిట్ ఎప్పుడు టాప్ ప్లేస్ లోనే ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే గదర్ 2 సినిమాలో అమీషా పటేల్ సన్నీ డియోల్‌ సరసన హీరోయిన్ గా నటించింది.

Also Read: “చిన్మయి” పై వస్తున్న ట్రోల్స్ కి “రాహుల్ రవీంద్రన్” స్ట్రాంగ్ రిప్లై..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like