మారుతీరావు మరణం తర్వాత కొత్త ట్విస్ట్…అమృత అక్కడికి వెళ్లి సీక్రెట్ గా ఎందుకు ఫోటోలు తీసింది?

మారుతీరావు మరణం తర్వాత కొత్త ట్విస్ట్…అమృత అక్కడికి వెళ్లి సీక్రెట్ గా ఎందుకు ఫోటోలు తీసింది?

by Sainath Gopi

కూతురు కులాంతర వివాహం చేసుకోవడం సహించలేని మారుతీరావు మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని  హత్య చేయించిన సంగతి అందరికి తెలిసిందే.ప్రణయ్, అమృతలు 2018 జనవరి 31న ప్రేమ వివాహం చేసుకోగా సెప్టెంబర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మారుతీ రావు హత్య చేయించారు. అయితే ప్రణయ్ పై దాడి జరిగిన సమయంలో అమృతవర్షిణి పక్కనే ఉంది. ఈ కేసులో మారుతీరావు ఏ 1 గా, అతని తమ్ముడు శ్రవణ్‌ ఏ 2 గా ఉన్నారు. ఏ 1 నిందితుడిగా ఉన్న మారుతీరావు హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో ఈ నెల మార్చి 8 న ఆత్మహత్య చేసుకున్నాడు.

విషం కారణంగానే ఆయన మృతి చెందినట్టు పోస్టుమార్టం లో తేల్చారు. కారులో కానీ, ఆయన గదిలో కానీ విషం బాటిల్ దొరకలేదు. ఈ విషం బోటిల్ కోసం క్లూస్ టీం వెతుకుతున్నారు. ఈ నెల 7వ తేదీ రాత్రి 8:22 గంటలకు మారుతీరావు చివరి సారిగా తన లాయర్ తో ఫోన్ మాట్లాడారు మారుతీ రావు. ఆదివారం ఉదయం ఆయనకు కలవాల్సి ఉంది. కానీ ఇంతలో మారుతీ రావు ఇలా చేసేసరికి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మారుతీరావు ఆత్మహత్య  కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

 

మారుతీ రావు చివరగా రాసిన లెటర్ లో అమృత గురించి ఇలా రాసారు. గిరిజా క్షమించు… అమృత తల్లి దగ్గరకు వెళ్లిపో” మరుసటి రోజు జరిగిన అంత్యక్రియలకు అమృత వెళ్లగా మారుతీరావు బంధువులు గో బ్యాక్ అంటూ  నినాదాలు చేశారు,దీంతో అక్కడి నుంచి వెనుదిరింది. తండ్రి చివరి కోరిక మేరకు అమృత ఒక నిర్ణయం తీసుకుంది. తన తండ్రి ఆత్మహత్య చేసుకోవడం వల్ల తన తల్లి కూడా ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోననే అమృత భయపడింది.

ఎట్టకేలకు తండ్రి చివరి కోరిక తీర్చిన అమృత

మిర్యాలగూడలో మారుతీరావు ఇంటికి వెళ్లిన అమృత అక్కడ తన తల్లి గిరిజాను కలిసింది..తల్లి బాధలో ఉందని ఓదార్చేంది.ఇద్దరు కలిసి అరగంట సేపు మాట్లాడుకున్నారు.మారుతీరావు ఆత్మహత్య తర్వాత తల్లిని అమృత కలవడం ఇదే తొలిసారి.అయితే ప్రణయ్ తల్లిదండ్రులను వదిలిపెట్టి తాను తల్లి దగ్గరకు వెళ్లలేనని ,ఒకవేళ తన తల్లి తన దగ్గరికి వచ్చి ఉంటే మాత్రం తనకు ఎలాంటి అభ్యంతరం లేదంది అమృత చెప్పేసింది.

ఇది ఇలా ఉంటె…మిర్యాలగూడలోని నాగార్జుననగర్ కాలనీలో మారుతిరావుకు చెందిన ఫ్లాట్స్ కు అమృత వెళ్లినట్టుగా. బైక్ మీద వెనక కూర్చొని ఫోటోలు తీసే కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు ఎందుకు తీశారు అనేది తెలీదు. ఆస్తుల వివరాల కోసమేనా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ అమృత తన తండ్రి ఆస్తిలో చిల్లిగవ్వ కూడా అక్కర్లేదు అంటూ ఇంతకముందు తెలిపింది. మరి అసలు కథ ఏంటో తెలియాలి అంటే వేచి చూడాలి.

You may also like