తండ్రి చనిపోయిన తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్న అమృత…భర్త కూడా చనిపోవడంతో.?

తండ్రి చనిపోయిన తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్న అమృత…భర్త కూడా చనిపోవడంతో.?

by Sainath Gopi

మారుతి రావు ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. మారుతీరావు అంత్యక్రియలు మిర్యాలగూడలో పూర్తయ్యాయి. కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తమ్ముడు శ్రవణ్ అన్న చితికి నిప్పంటించారు. ప్రణయ్‌ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు వాహనంలో వచ్చిన అమృత తండ్రిని చివరి చూపు చూడకుండానే కొన్ని సెకన్ల వ్యవధిలోనే వెను తిరిగింది. మారుతీరావు కుటుంబ సభ్యులు, స్థానికులు అమృత గో బ్యాక్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కొంచెం సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే ఆమె చివరి చూపు చూడలేకపోయింది.

తాజాగా అమృత స్పృహ తప్పి పడిపోయారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఆమె నివాసంలో ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూ సమయంలో సోమవారం రాత్రి ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. కుటుంబసభ్యులు అమెను వెంటనే 108 వాహనం ద్వారా స్థానిక ఆసుపత్రికి తరలించారు. అమృత తండ్రి, ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

ఇప్పుడు తన తండ్రి మరణం తర్వాత అమృత సంచలన నిర్ణయం తీసుకుంది. భర్త లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన అమృత ప్రస్తుతం తల్లి విషయంలో బాధపడుతుంది. తన తండ్రి ఆత్మహత్య చేసుకోవడం వల్ల తన తల్లి కూడా ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోననే అమృత భయపడిపోతుందంట. తన తండ్రి చివరి కోరిక మేరకు అమృత తన తల్లి దగ్గరకి వెళ్లనుంది అంట. భర్త ఎలాగో పోయాడు.. తండ్రి కూడా పోయాడు.. ఇక మిగిలింది.. కన్నతల్లి కనుక ఆమెకోసమైనా ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుందంట.

మారుతీ రావు చివరగా రాసిన లెటర్ లో అమృత గురించి ఇలా రాసారు. “తల్లీ అమృత.. అమ్మ దగ్గరికి వెళ్ళిపో”. అని రాసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇంకా చాలా విషయాలు అందులో రాసారు అంట. అమృతను ఎలాగైనా కలవాలని మిర్యాలగూడకు చెందిన వారితో కూడా రాయబారం పంపాడు. కానీ, అమృత మాత్రం ఏమాత్రం మెట్టు దిగలేదు. కూతురు దూరం కావడంతో పాటు కేసులు పెట్టడంతో మనస్తాపానికి గురైనట్లు,దాంతో కూతురు ఇక తన మాట వినదని నిర్ణయించుకోని ఆత్మహత్య విషం తాగి ఆత్మహత్య  చేసుకున్నాడు అని తెలుస్తుంది.

You may also like