Ads
ఆడియో ఫంక్షన్లు, షోలు ఇలా అన్నిట్లో కూడా అనసూయ భరద్వాజ్ అలరిస్తూ ఉంటుంది. కేవలం ఇటు బుల్లితెరలో మాత్రమే కాకుండా వెండితెర లో కూడా ఈమె మెరుస్తోంది. రంగస్థలం సినిమా లో రంగమ్మత్త పాత్ర చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. అయితే తాజాగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో కూడా ఈమె మంచి పాత్ర చేసింది.
Video Advertisement
మంగళం శ్రీను భార్యగా దాక్షాయిని పాత్ర లో కనిపించి ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది. అయితే ఈమె పాత్ర కాస్త తక్కువగా ఉందంటూ టాక్ కూడా వచ్చింది. అయితే ఇంతకీ ఈ సినిమాకి అనసూయ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అనేది చర్చగా మారింది.
ఇక ఈ విషయం లోకి వస్తే.. ఈ పాత్ర కోసం అనసూయ రోజుకి లక్ష నుంచి లక్షన్నర రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. పది రోజులకు పైగా కాల్షీట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి అనసూయ దాదాపు 12 లక్షల రూపాయల వరకు తీసుకుందట. ఫస్ట్ పార్ట్ లో కంటే కూడా సెకండ్ పార్ట్ లో అనసూయ పాత్ర కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
End of Article