“ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా.?”… వైరల్ అవుతున్న యాంకర్ వర్షిణి స్టోరీ.!

“ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా.?”… వైరల్ అవుతున్న యాంకర్ వర్షిణి స్టోరీ.!

by Mohana Priya

Ads

గత కొద్ది సంవత్సరాలుగా టెలివిజన్ పై తన యాంకరింగ్ తో అలరిస్తున్నారు వర్షిణి సౌందరాజన్. ఈటీవీ తో పాటు, మాటీవీ అలాగే ఇంకా వేరే ఛానల్స్ లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈవెంట్స్ లో కూడా సందడి చేస్తారు వర్షిణి. అయితే వర్షిణి యాంకరింగ్ లోకి రాకముందు కొన్ని సినిమాల్లో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. వెబ్ సిరీస్ తో పాటు, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన చందమామ కథలు సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించారు వర్షిణి.

Video Advertisement

Bigg Boss 5 Telugu Contestant Varshini Sounderajan

అంతే కాకుండా కాయ్ రాజా కాయ్ అనే సినిమాలో కూడా ఒక హీరోయిన్ గా నటించారు. అయితే ఇటీవల వర్షిణి చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే గత శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రతం జరుపుకున్నారు. దాంతో చాలా మంది సెలబ్రిటీలు నెటిజన్లు వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కానీ వర్షిణి మాత్రం వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన ఎటువంటి పోస్ట్ చేయలేదు. దాంతో ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా మావా బ్రో అని ఒక వీడియో తీసి ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పెట్టారు. ఈ వీడియోలో వర్షిణి ఫ్రెండ్ తో కలిసి కార్ లో బయటికి వెళ్తున్నారు. ప్రస్తుతం వర్షిణి సమంత అక్కినేని హీరోయిన్ గా నటిస్తున్న శాకుంతలం సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.


End of Article

You may also like