ప్రేమకి ఎలాంటి హద్దులు కూడా అడ్డు కాదు ఏమో..! వీరి కథ ఏంటంటే..?

ప్రేమకి ఎలాంటి హద్దులు కూడా అడ్డు కాదు ఏమో..! వీరి కథ ఏంటంటే..?

by kavitha

Ads

ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌ పరిచయాలు ప్రేమగా మారడం, ఆ ప్రేమ కోసం సరిహద్దులు మాత్రమే కాకుండా దేశాలు సైతం దాటి వెళ్తున్నారు. రీసెంట్ గా ఇలాంటి వార్తలు వైరల్ గా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్‌ మహిళ సీమా, పబ్జీలో పరిచయం అయిన వ్యక్తిని ప్రేమించడం,

Video Advertisement

ఆ ప్రేమ కోసం అడ్డదారిలో భారత్‌లో ప్రవేశించిన విషయం  తెలిసిందే. ఈ ఘటన మరచిపోక ముందే ఇండియాకు చెందిన ఒక యువతి, ఫేస్‌బుక్‌ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఆ ప్రేమ కోసం పాకిస్తాన్‌కు వెళ్లింది. ఈ విషయం  ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మహిళ అంజు(34), పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెకు కొద్ది రోజుల క్రితం  ఫేస్‌బుక్‌ లో పాకిస్థాన్‌ యువకుడు నస్రుల్లా ఖాన్‌(29)తో పరిచయం అయ్యింది. వీరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది. అలా  కొన్నాళ్ళు సాగిన తరువాత ఇద్దరు కలవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే అంజు,భర్త పిల్లలను విడిచి పెట్టి, ప్రేమించిన వ్యక్తి కోసం సరిహద్దులు కూడా దాటి, జూలై 21న పాకిస్థాన్‌ లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ఫ్రావిన్స్‌లో ఉండే దీర్ సిటీకి వెళ్లినట్టుగా తెలుస్తోంది.ఈ విషయంలో అంజు భర్త అయిన అరవింద్‌ మాట్లాడుతూ, తన భార్య అంజు జైపూర్‌కు వెళ్తున్నాననే వంకతో గురువారం నాడు ఇంటి నుండి వెళ్లినట్టు వెల్లడించారు. అయితే అంజు పాకిస్థాన్‌కు వెళ్లినట్టుగా తెలిసిందని  పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆమె స్నేహితుడిని కలవాలని తెలిపి, ఇంటి నుండి వెళ్లిపోయిందని తెలిపారు. ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు ఆమె భర్తకి ఫోన్ చేసి, ఆమె లాహోర్‌లో ఉన్నానని, 2, 3 రోజుల్లో ఇంటికి తిరిగి వస్తానని అంజు చెప్పినట్టు వెల్లడించాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Also Read: “దేశాన్ని రక్షించాను కానీ..?” అంటూ… “మణిపూర్ ఘటన” బాధితురాలి భర్త ఆవేదన..! కంటతడి పెట్టిస్తున్న మాటలు.!


End of Article

You may also like