“బుల్లెట్ బండి” తో భార్య తెచ్చిన పాపులారిటీ.. భర్త చేసిన ఈ పని వల్ల పోయిందిగా?

“బుల్లెట్ బండి” తో భార్య తెచ్చిన పాపులారిటీ.. భర్త చేసిన ఈ పని వల్ల పోయిందిగా?

by Megha Varna

Ads

ఏ పెళ్లి మండపాలు చూసినా.. పెళ్లి కూతురు బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తా పా అంటూ స్టెప్పులు వేస్తోంది. సోషల్ మీడియాలో తరచూ మనం ఈ పాటకు స్టెప్పులు వేసేవాళ్లను చూస్తూనే ఉంటాం.

Video Advertisement

అయితే అసలు ఈ పాట తో పాపులర్ అయ్యారు అశోక్, సాయి ప్రియ. సోషల్ మీడియాలో ఈ పాటకి స్టెప్పులు వేసి పాపులారిటీని సంపాదించుకున్నారు ఈ భార్యా భర్తలు. నిజంగా సాయి ప్రియకైతే ఒక టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. ఇక అశోక్ గురించి చూస్తే… అశోక్ కూడా పాపులర్ అయిపోయారు కానీ డాన్స్ తో కాదు అవినీతితో. ప్రస్తుతం అశోక్ హాట్ టాపిక్ అయ్యిపోయాడు. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా అశోక్ ని పట్టుకున్నారు. రూ.30,000 లంచం తీసుకుంటూ ఏసీబీ చేతికి చిక్కాడు అశోక్.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అశోక్ మంచిర్యాల జిల్లా, జన్నారం మండలంకు చెందిన వాడు. పెళ్లయ్యాక హైదరాబాద్ వచ్చేసాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. సోషల్ మీడియా లో కూడా ఒక గుర్తింపుని పొందాడు అశోక్. అయితే అసలు ఇతను డ్యాన్స్ చేయకపోయినా క్రేజ్ వచ్చేసింది. అసలైన పాటలో అతను లేడు. ఇక్క బారాత్ వేడుకలో తన భార్య సాయి ప్రియ డాన్స్ చేసింది. అశోక్ ఆమె ముందు వున్నాడు. కపుల్స్ ఇద్దరు ఉండడంతో ఆటోమేటిక్ గా క్రేజ్ వచ్చేసింది.

bullet bandi

సోషల్ మీడియా లో అందరికీ పరిచయం అయ్యిపోయాడు. ఇక ఇది ఇలా ఉంటే టౌన్ ప్లానర్‌ గా పని చేస్తున్న అశోక్ ఏసీబీకి దొరికిపోయాడు. దీనితో వచ్చిన ఫేమ్ కాస్త తుస్సుమంది. లంచం తీసుకుంటున్న అశోక్ ని అడ్డంగా పట్టేసుకున్నారు ఏసీబీ అధికారులు. తనకేం తెలియదని..కుట్ర చేశారని అశోక్ వాదించడానికి కూడా ఏ అవకాశం లేక పోయింది. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో చేసేదేం లేదు. తన పాటలాగే ఈ వార్త కూడా అంతటా పాకేస్తోంది. ఒక పాపులారిటీ వచ్చాక జాగ్రత్త పడాలి లేదంటే ఇబ్బందే కదా..? ఈ విషయాన్నీ అశోక్ మరిచిపోయాడు.


End of Article

You may also like