Ads
ఇటీవల కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా తమిళ్ తో పాటు తెలుగు భాషల్లో కూడా విడుదల అయ్యింది. ఈ సినిమాకి ప్రస్తుతం తెలుగులో కూడా హిట్ టాక్ వస్తోంది.ఈ సినిమా చివరిలో చూస్తే సూర్య హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అని విక్రమ్ సినిమా చూసిన వారికి అర్థమయ్యే ఉంటుంది.
Video Advertisement
ఈ సినిమా క్లైమాక్స్ లో చూస్తే సూర్య పాత్రని రోలెక్స్ అనే ఒక పాత్రగా పరిచయం చేస్తారు. సూర్య పాత్ర లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాలో విలన్ పాత్రలో నటించిన అర్జున్ దాస్ తో మాట్లాడుతూ ఉంటారు.
ఖైదీ, విక్రమ్, తర్వాత రాబోయే సూర్య సినిమా మధ్యలో ఏదో ఒక కనెక్షన్ ఉంది అని ఇది చూస్తే అర్థమవుతుంది. అయితే అర్జున్ దాస్ పాత్ర ఖైదీ సినిమాలో కార్తీ పోషించిన ఢిల్లీ పాత్ర గురించి మాట్లాడుతాడు. దీన్ని బట్టి చూస్తే కార్తీ హీరోగా, సూర్య నెగిటివ్ పాత్రలో నటిస్తున్నారు అని అర్థమవుతుంది. అయితే ఈ సినిమాలోని ఒక సీన్ పై చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదేంటంటే కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా లో హీరో కార్తీ బిర్యాని తినే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. విక్రమ్ సినిమాలో కూడా అలాంటి సీన్ ఒకటి ఉంటుంది.
సినిమాలో చూస్తే ఈ సీన్ పెట్టడానికి అంత పెద్ద సందర్భం ఉన్నట్టు అనిపించదు. కావాలి అని పెట్టారు ఏమో అనిపిస్తుంది. దాంతో చాలా మంది, “అవసరం లేకపోయినా కూడా ఇలాంటి సీన్ పెట్టాల్సిన అవసరం ఏంటి? సినిమా మంచి ఫ్లోలో వెళ్తున్నప్పుడు అలాగే కొనసాగించవచ్చు కదా?” అని అంటున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే విక్రమ్ సినిమా మాత్రం ప్రస్తుతం హిట్ టాక్ తెచ్చుకుంటోంది. చాలా సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ ఒక యాక్షన్ రోల్ చేశారు. ప్రేక్షకులు కూడా కమల్ హాసన్ ని ఇలా చూడాలి అని చాలా సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. కమల్ హాసన్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించిన ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కూడా చాలా బాగా చేశారు అని అందరూ పొగుడుతున్నారు.
End of Article