ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రతీ ఒక్కరికి ఆసక్తి ఉంటుంది.ఎందుకంటే జాబ్ సెక్యూరిటీ, సౌకర్యం ఉంటుంది. కుటుంబ సభ్యులకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి. భరోసాను కల్పిస్తుంది.ప్రభుత్వ ఉద్యోగాలు రావడమే ఆరాడు ఈ రోజుల్లో. కానీ ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పటికీ నటన పై ఉన్న ఇష్టంతో తమ కెరీర్ను పణంగా పెట్టి, సినీ పరిశ్రమకు వచ్చి, ఎన్నో ఇబ్బందులు దాటుకుని పెద్ద స్టార్లుగా నిలిచిన బాలీవుడ్ ప్రముఖుల గురించి తెలుసుకుందాం. మరి వారు ఎవరో చూద్దాం..
1.రజనీకాంత్
బాలీవుడ్లో కూడా పనిచేసిన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకప్పుడు బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో బస్ కండక్టర్గా పనిచేశారు. అతను నటుడిగా మారడం కోసం తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. నేడు అతను భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరు. అతనికి దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు మరియు ప్రజలు అతన్ని తలైవా అని ప్రేమగా పిలుస్తారు.
2.దిలీప్ కుమార్
హిందీ సినీ పరిశ్రమ చూసిన అత్యంత ప్రతిభావంతుల్లో దిలీప్ కుమార్ ఒకరు.దివంగత నటుడు దిలీప్ కుమార్ ఔంద్ పూణేలో మిలటరీ క్యాంటీన్ను నడిపేవారు. బాలీవుడ్ నటి దేవికా రాణి అతన్ని గుర్తించి బాలీవుడ్ సినిమా ఆఫర్ ఇచ్చింది.ఇక అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు.
3.దేవ్ ఆనంద్
బాలీవుడ్లోకి రాకముందు దేవ్ ఆనంద్ సెన్సార్ బోర్డ్ క్లర్క్గా పనిచేశాడు. ఎన్నో హిట్ చిత్రాలను అందించిన ఆయన చిత్ర పరిశ్రమకు అందించిన సేవలు ఎనలేనివి.
4.రాజ్ కుమార్
40వ దశకం చివరిలో రాజ్ కుమార్ ముంబైకి వెళ్ళి అక్కడ ముంబై పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. బాలీవుడ్లో కెరీర్ను కొనసాగించేందుకు ఉద్యోగాన్ని వదిలేశాడు.
5.జానీ వాకర్
బాలీవుడ్ లో పాత తరము గొప్ప హాస్య నటుడు జానీ వాకర్.సినిమాల్లోకి రాకముందు జానీ వాకర్ ముంబైలో బస్ కండక్టర్ గా పని చేసేవాడు.
6.బాల్రాజ్ సాహ్ని
బాల్రాజ్ సాహ్ని ప్రముఖ నటుడు. నటుడిగా మారక ముందు బెంగాల్లోని శాంతినికేతన్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పని చేశారు. అతని భార్య కూడా అదే సంస్థలో బోధించింది.
7.అమోల్ పాలేకర్
అమోల్ పాలేకర్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవాడు.అయితే ఆ ఉద్యోగాన్ని వదిలి బాలీవుడ్ లో కెరీర్లో కొనసాగించాడు.
8.అమ్రిష్ పూరి
సినీ పరిశ్రమలో విశిష్ట నటుడిగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న అమ్రిష్ పూరి, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. కానీ నటించాలనే కలను నెరవేర్చుకోవడం కోసం హీరోగా హిందీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. అయితే అమ్రిష్ పూరి ఎక్కువగా విలన్ రోల్స్ లోనే నటించాడు. మిస్టర్ ఇండియాలోని ఆయన చేసిన మొగాంబ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
9.శివాజీ సతమ్
ACP ప్రద్యుమన్ పాత్రలో పాపులర్ అయిన శివాజీ సతమ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్ గా పనిచేసేవారు. కానీ కానీ అతను నటన పై ఉన్న ఆసక్తితో థియేటర్లో చేరి నటుడిగా మారాడు.


మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఏళ్ల నుండి తెలుగులో తవ హీరోగా కొనసాగుతున్నారు. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి సినిమాలలో భారీ డిజాస్టర్ గా నిలిచిన మూవీ ‘ఆచార్య’. ఈ మూవీ తర్వాత ఆ రేంజ్లో ‘భోళా శంకర్’ పై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ మూవీ పైనే ట్రోల్స్ కనిపిస్తున్నాయి. ఆడియెన్స్, నెటిజన్లు ఈ మూవీని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు.
అసలు మూవీలో మెగాస్టార్ చిరంజీవికి రేంజ్కు తగిన సన్నివేశాలు లేవని, క్రింజీగా ఉందని నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో జబర్దస్త్ నటుల కామెండీ కానీ, శ్రీముఖి నడుము సన్నివేశం సెట్ కాలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మీమర్స్ అయితే భోళా శంకర్ మూవీలోనీ సీన్స్ ను రకరకాల మీమ్స్ ను తయారు చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
జాతిరత్నాలు అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఈ మూవీలోనీ కీర్తి సురేష్ ఫోటోను షేర్ చేసి, అదేంటి ఏదో డీవీడీ ప్లేయర్ కి కనెక్ట్ చేసినట్టు ఆ వైర్లు ఏంటి అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ మూవీలో ఆమెకు తలకు సర్జరీ చేసినట్టు చూపించారు. కానీ ఆమెకు హెయిర్ తీయలేదని, పైగా తలకు వైర్లు పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు.
తిరుమలలో చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లాకు చెందిన ఆరు సంవత్సరాల లక్షిత ఫ్యామిలీకి టీటీడీ ఎక్స్గ్రేషియాను ఇవ్వనున్నారు. టీటీడీ తరపున ఐదు లక్షలు ఇవ్వనుండగా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఐదు లక్షలు ఇవ్వనుంది. మొత్తం కలిపి పది లక్షల ఎక్స్గ్రేషియాను లక్షిత కుటుంబానికి అంచనున్నట్లు టీటీడీ వెల్లడించింది. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి లక్షిత ఇన్సిడెంట్ పై స్పందించడం కోసం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ధర్మారెడ్డి మాట్లాడుతూ, చిరుత పులి దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమైన, విషాదకరమైన ఘటన అని తెలిపారు. లక్షిత నడకదారిలో తన తల్లిదండ్రులతో కాకుండా పలుమార్లు ఒంటరిగా వెళ్లినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో నడకదారిలో పటిష్టమైన చర్యలు మరింతగా తీసుకుంటామని, త్వరలో 500 సీసీ కెమరాలను ఏర్పాటు చేసి అడివిమృగాలు కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని వెల్లడించారు.
గాలి గోపురం నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భద్రతను మరింతగా పెంచుతామని, 10 మీటర్లకు ఒక సెక్యూరిటీ గార్డు చొప్పున నియమిస్తామని వెల్లడించారు. నడకదారిలో చిన్నపిల్లలతో వచ్చే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిలల్లను వారి సంరక్షణలో ఉంచుకోవాలని సూచించారు, హై అలర్ట్ ప్రాంతాలలో బోన్లను ఏర్పాటు చేస్తామని, రాత్రి 10 గంటల వరకు ప్రస్తుతం నడకదారిలో తిరుమల వచ్చే భక్తులను అనుమతిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో అనుమతించే టైమ్ ను తగ్గించేందుకు ఆలోచిస్తున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు.
తాను సినిమాలలో నటించడానికి ప్రయత్నించలేదని, అది నిజం కాదని చెప్పడం కోసం జయలలిత ఆ లెటర్ లో తనకు వచ్చిన ఒక పెద్ద ఆఫర్ ను రిజెక్ట్ చేసిన విషయన్ని ఆ లేఖలో తెలిపింది. 1980లో రిలీజ్ అయిన ‘బిల్లా’ మూవీలో తనకు ఆఫర్ వచ్చిందని, అది కూడా దేశంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఉన్న బాలాజీ ప్రొడక్షన్స్ నిర్మించిన మూవీ అని, ఆ మూవీలో హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఆ సినిమాలో ముందుగా తనకే ఆఫర్ చేశారు.
తాను సినిమాలలో నటించాలనుకుంటే రజినీకాంత్ వంటి సూపర్ స్టార్ పక్కన హీరోయిన్ గా చేసే ఛాన్స్ ను వదులుకునేదాన్ని కాదు అని రాసుకొచ్చారు. తాను ఆ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేసిన తర్వాత ఆ అవకాశాన్ని శ్రీప్రియకు బాలాజీ ప్రొడక్షన్స్ ఇచ్చిందని ఆ లెటర్ లో జయలలిత వివరించారు.
అంతే కాకుండా ఈ విషయాన్ని బాలాజీ కూడా పబ్లిగ్గానే వెల్లడించారు. ఈ విషయం అందరికీ తెలుసు. మీరు ఎందుకు తెలుసుకోలేకపోయారో అర్థం కావట్లేదని, ఆ భగవంతుడి దయ వల్ల ఆర్థికంగా తనకి ఎలాంటి కష్టాలు లేవని, తన దృష్టి వేరే వైపు ఉందని, ఇక పై సినీ కెరీర్ను కొనసాగించడంలో తనకు ఆసక్తి లేదని జయలలిత ఆ లెటర్ లో తెలిపారు.
1. రుద్రవీణ:
2. స్వయంకృషి:
3. ఆపద్బాంధవుడు:
4. చంటబ్బాయి:
5. విజేత:
6. జగదేక వీరుడు అతిలోక సుందరి:
7. ముఠా మేస్త్రి:
8. సైరా:
9. ఇంద్ర:
10. అభిలాష:
11. ఛాలెంజ్:
12. యముడికి మొగుడు:
యాంకర్ ఓంకార్ స్థిరపడిన తరువాత హిందీ టీవీ డ్యాన్స్ షోలు మాత్రమే ఉన్న సమయంలో వాటి మాదిరిగానే ఒక కాన్సెప్ట్ తో తెలుగులో డాన్స్ షోను నిర్మించాడు. ఆ షో పేరు ఆట. ఈ షో అప్పట్లో చాలా పాపులర్ అయ్యింది. రెండు సీజన్ల తరువాత ఆట జూనియర్స్ మొదలుపెట్టాడు. దీని అందరూ చిన్నపిల్లలే పోటీ పడతారు. ఈ డ్యాన్స్ షో కూడా చాలా పాపులర్ అయ్యింది. ఆట జూనియర్స్ 7 వరకు ఈ షో ప్రసారం అయ్యింది.
అయితే ఆట జూనియర్స్ 5 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన బిట్టు అనే అబ్బాయి, ఒక్క డ్యాన్స్ తో మాత్రమే కాకుండా తన మిమిక్రీతో కూడా ఆకట్టుకున్నాడు. బిట్టు చాలామంది అభిమానచేవారు. ఆట జూనియర్స్ 5 ఎంటర్టైన్మెంట్ ట్రోఫిని అందుకున్నాడు. అతన్ని ఆటబిట్టు అని పిలుస్తుంటారు. ఆ తరువాత ఛాలెంజ్ డాన్స్ షో 3 పాల్గొని విన్నర్ అయ్యాడు.
ఈటీవీలో ప్రసారం అయిన ఆటైనా పాటైనా దేనికైనా రెడీలో పాల్గొన్న బిట్టు విజేతగా నిలిచాడు. ఆ తరువాత ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన కిరాక్ కిడ్స్ లో కూడా పాల్గొన్నాడు. వర ప్రసాద్ పొట్టి ప్రసాద్, కమలతో నా ప్రయాణం వంటి చిత్రాలలో బాలనటుడిగా నటించాడు. ఇప్పుడు పెద్దగా యిన బిట్టు డ్యాన్సర్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు.
పైన ఫోటోలో సైకిల్ మీద కూర్చున్న చిన్నోడు ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ టాలీవుడ్ స్టార్ హీరో మాత్రమే కాకుండా ఇతని తమ్ముడు కూడా హీరోనే. అతని తండ్రి టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు. ఈ హీరో తండ్రి నాన్న కూడా ఒకప్పుడు తెలుగులో ప్రముఖ నటుడిగా రాణించి, కాలం చేశారు. ఈ హీరో తన స్టైల్ తో ఆకట్టుకుని స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.
ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈ హీరోకి అమ్మాయిల ఫోలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో మరెవరో కాదు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఈ మూవీ సంచలన విజయం సాధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అందరూ ‘పుష్ప 2’ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ సమకూరుస్తున్నారు. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్ తో మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
కొత్త తరహ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ కథ విషయానికి వస్తే, హైదరాబాద్లో అమ్మాయిలు వరుగా అపహరణకు గురవుతుంటారు. సుమారు 16 మంది కనిపించకపోవడంతో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం కేరళ నుండి ఐపీఎస్ ఆద్య (నందితా శ్వేతా)ను సిటీకి రప్పిస్తారు. అప్పటికే ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసు ఆఫీసర్ అభయ్ (అశ్విన్ బాబు) తో పాటు ఆద్య కూడా విచారణ మొదలుపెడుతుంది.
తప్పిపోయిన అమ్మాయిలకు ఏమైంది? అమ్మాయిలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ కేసుకు అండమాన్ దీవుల్లో నివసించే గిరిజన తెగ హిడింబాలకు ఉన్న సంబంధం ఏంటి? ఆద్య, అభయ్ ఈ కేసును చేధించారా? అనేదే మిగతా కథ. ఎంచుకున్న కథ ఎంత గొప్పది అయినా, ఎంత క్రియేటివ్గా చూపించినా ఆడియెన్స్ కి అర్థం కాకపోతే ఆ మూవీతో కనెక్ట్ కాలేరు. ఈ మూవీలో అదే జరిగింది.
నిజానికి ఈ మూవీ కాన్సెప్ట్ కొత్తది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చూపిస్తూ, వర్తమానంలో జరిగే సీన్స్ చూపించడంతో స్టోరీ ఎక్కడ నడుస్తుందో అర్థం కాకపోవడం ఆడియెన్స్ ను గందరగోళానికి గురి చేస్తుంది. ఇంటర్వెల్ సన్నివేశం సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ ను పెంచుతుంది.
అసలు స్టోరీ సెకండాఫ్లో చూపించారు. హిడింబ తెగ నేపథ్యం, హైదరాబాద్ లో జరుగుతున్న కిడ్నాపులకు, హిడింబ తెగకు కనెక్షన్ ఉండడం, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు ఆడియెన్స్ ను థ్రిల్ కు గురిచేస్తుంది. అయితే డైరెక్టర్ పలు చోట్ల సినిమాటిక్ లిబర్టీ ఉపయోగించుకున్నాడు. థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చుతుంది.
మెగాస్టార్ చిరంజీవి మూవీ అంటే ఇష్టపడని ఆడియెన్స్ ఉండరు. ముఖ్యంగా మెగా అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ ఈరోజు (ఆగస్టు 11) థియేటర్లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కోలీవుడ్ సూపర్ హిట్ వేదళం మూవీకి రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీలో చిరంజీవి, కీర్తి సురేష్ అన్నాచెల్లెళ్ళుగా నటించారనే విషయం తెలిసిందే.
భోళా శంకర్ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ కి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో తెలియచేస్తున్నారు. కొందరు సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందని, మెగాస్టార్ చిరంజీవి లుక్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ సన్నివేశాలు పర్వాలేదని చెబుతున్నారు. ఇంటర్వెల్ బాంగ్ తో ప్రధమార్ధం పర్వాలేదని అంటున్నారు
అయితే ఈ చిత్రంలో చిరంజీవి, హీరోయిన్ తమన్నా మధ్యలో పెట్టిన లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేదని, అలాగే ఖుషి నడుము సీన్ కూడా అంతగా సెట్ అవలేదని, భోళా శంకర్ సినిమాలో ఇలాంటి సన్నివేశాలు పెట్టడం అవసరమా అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో రీఎంట్రీ ఇచ్చిన తరువాత నటించిన సినిమాలు ప్రీమియర్స్ ద్వారా ఓవర్సీస్లో మంచి కలెక్షన్స్ సాధించాయి. వాటితో పోలిస్తే ‘భోళా శంకర్’ సినిమా తక్కువ వసూళ్లను రాబట్టిందని అంటున్నారు. ఈ క్రమంలోనే హీరో బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ ప్రీమియర్ వసూళ్లతో ‘భోళా శంకర్’ కలెక్షన్స్ పొలుస్తున్నారు. ప్రీమియర్స్ ద్వారా బాలయ్య సినిమా 708k డాలర్లను కలెక్ట్ చేసిందని, చిరంజీవి మూవీ దానిలో సగం కూడా వసూల్ చేయలేదని అంటున్నారు.