హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. అందువల్ల హర్రర్, సస్పెన్స్, థ్రిల్లిర్ జానర్ లో సినిమాలు తరచుగా వస్తుంటాయి. ఈ చిత్రాలలో ఎక్కువశాతం సినిమాలు బాక్సాపీస్ దగ్గర హిట్ అయినవే ఉంటాయి.
ఇటీవల హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘అశ్విన్స్’ అనే సినిమా రిలీజ్ అయ్యింది. తెలుగు, తమిళంలో ద్విభాషా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో ‘తారామణి’ మూవీ యాక్టర్ వసంత్ రవి, విమలా రామన్ ప్రధాన పాత్రలలో నటించారు. గత నెల రిలీజ్ అయ్యి, ఆకట్టుకున్న ఈ మూవీ రీసెంట్ గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
తరుణ్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మూవీ ‘అశ్విన్స్’. ఈ మూవీని విరూపాక్ష ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై నిర్మించాడు. ఈ మూవీ కథ విషయానికి వస్తే అర్జున్ (వసంత్ రవి), రీతూ (సరస్వతి మీనన్) ఇద్దరు భార్యభర్తలు. వీరు ముగ్గురు ఫ్రెండ్స్ రాహుల్, వరుణ్, గ్రేస్ తో కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్ నడుపుతుంటారు. ఈ ఐదుగురు యూట్యూబర్స్ డార్క్ టూరిజం పైన ఒక ఎపిసోడ్ను షూట్ చేయడం కోసం లండన్లో ఒక దీవిలో ఉండే బంగ్లాలోకి వెళ్తారు.
ఆ బంగ్లాలో ఫేమస్ ఆర్కియాలజిస్ట్ అయిన ఆర్తి రాజగోపాల్(విమలా రామన్) ఆత్మ ఉందని, అక్కడి వెళ్లిన 15 మందిని చంపిందనే ప్రచారం ఉంటుంది. అర్జున్ టీమ్, ఆ బంగ్లాలో తిరిగే ఆత్మలను, అరుపులను కెమెరాలో బంధించడానికి ప్రయత్నిస్తారు. వారికి ఆ బంగ్లాలో ఎదురయ్యే అనూహ్య పరిణామాలు ఏంటి? ఆర్తి రాజగోపాల్ ఎలా మరణించింది? అసలు ఆ బంగ్లాలో ఏముంది? అశ్వినీ దేవతలు ప్రసాదించిన బొమ్మలు కనుగొన్న ఆర్తి రాజగోపాల్ కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తనవాళ్లను రక్షించుకోవడం కోసం అర్జున్ ఏం చేశాడు? అనేది ‘ఆశ్విన్స్’ కథ.
మంచి, చెడు రెండింటినీ నియంత్రించే శక్తి మనిషికి మాత్రమే ఉందనే మెసేజ్ ను ఈ మూవీ ద్వారా దర్శకుడు చూపించారు. దర్శకుడు తరుణ్ తేజ సెలెక్ట్ చేసుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా, దానిని స్క్రీన్ పై చూపించడంలో కాస్త తడబడ్డాడు. అశ్విన్స్ మూవీ హారర్ మరియు మైథాలజీ కలిపి తెరకెక్కించిన ఒక డిఫరెంట్ సినిమా. హారర్ సినిమాలను ఇష్టపడేవారిని ఈ మూవీ ఆకట్టుకుంటుంది.
Also Read: “అణుబాంబు” తయారుచేసిన సైంటిస్ట్ కి భగవద్గీతతో ఉన్న సంబంధం ఏంటి..? అసలు ఈ వివాదం ఏంటి..?

ధోని పేరుతో ఉన్న ఒక ఓల్డ్ అపాయింట్మెంట్ లెటర్ తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది 2012కు సంబంధించిన లెటర్. ఇండియన్ సిమెంట్స్ సంస్థలో ధోనిని వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు సెలెక్ట్ చేసినట్లుగా ఆ లెటర్లో ఉంది. ఈ పోస్టుకి నెలకు శాలరీ రూ. 43వేలు (రూ.12,650-47,650)గా ఉంది.
జీతంతో పాటుగా స్పెషల్ పే రూ 20వేలు అని, ఫిక్స్డ్ అలెవెన్స్ రూ. 21,970 అని ఉంది. ఇవీ మాత్రమే కాకుండా హౌస్ రెంటల్ అలెవెన్స్ కి రూ.20,400, ప్రత్యేక హౌస్ రెంట్ అలెవెన్స్ కి రూ.8,400 (సబ్ ప్లాంట్స్లో వరక చేసినట్లయితే అదనంగా మరో రూ.8 వేలు) వార్తా పత్రిక ఖర్చులకు గాను 175 రూపాయలు, బెనిఫిట్స్ లేని ప్రత్యేక అలెవెన్స్ కి గాను 60వేల రూపాయలు ఇవ్వనున్నట్లు అపాయింట్మెంట్ లెటర్లో తెలిపారు.
మొత్తంగా చూస్తే వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కి గాను ధోని దాదాపు లక్షా 60వేల రూపాయలకు పైగా నెల జీతంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఈ లెటర్ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. అయితే ఆ సమయానికి వేల కోట్లు ఆర్జిస్తున్న ధోని ఈ ఉద్యోగం చేశాడా లేదా అన్న విషయాన్ని పక్కన బెడితే, ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్ గా ధోని బ్రాండ్ వాల్యూను ఈ లెటర్ తెలియచేస్తోంది. ఇండియా సిమెంట్స్ అనేది చెన్నై సూపర్కింగ్స్కు అనుబంధ సంస్థ.
తెలుగు రాష్ట్రాలలో జోరుగా వర్షాలు పడుతున్నప్పటికీ బేబీ మూవీ థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ యాబై కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇందులో హీరోగా అనంద్తో పాటు విరాజ్ అశ్విన్ కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల నటన పై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ‘బేబి’ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య యాక్టింగ్ ఫిదా అవుతున్నారు.
ఈ మూవీలో నటించిన యాక్టర్స్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ వంటి సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ దర్శకుడు సాయి రాజేష్ ఒక ఇంటర్వ్యూలో తాజాగా సినిమాకి సంబంధించిన పలు విషయాలను తెలిపారు. సినిమా క్లైమాక్స్లో హీరోయిన్ వైష్ణవి చైతన్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు చూపిస్తారు.
హీరో ఆనంద్ హీరోయిన్ గురించిన ఆలోచనలతో తాగుతూ అలాగే ఉండిపోయినట్లు దర్శకుడు చూపించాడు. కానీ రెండవ హీరోగా నటించిన విరాజ్ను చూపించలేదు. ఆ విషయం గూర్చి అడుగగా, ‘క్లైమాక్స్లో విరాజ్ సన్నివేశాన్ని తీశాం. కానీ నిడివి పరంగా ఆ సీన్ ను తొలగించాల్సి వచ్చింది’ అని తెలిపారు. ఆ విధంగా చాలా సన్నివేశాలు కట్ చేశామని, వాటిని ఓటీటీలో చూపిస్తామని వెల్లడించారు.
కన్నడ సినిమా స్థాయి ఏమిటనేది కేజీఎఫ్ తో వెలుగులోకి వచ్చింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యష్ కేజీఎఫ్ 2 మూవీతో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు, మేకర్స్ దృష్టి కన్నడ చిత్రాల వైపు మరలింది. కేజీఎఫ్ చిత్రాలతో పాటుగా కాంతార, విక్రాంత్ రోణ, కిరిక్ పార్టీ, చార్లీ 777, వంటి సినిమాలు కన్నడ ఇండస్ట్రీ స్థాయిని మరింతగా పెంచాయి. వాటి ద్వారా కన్నడ ఇండస్ట్రీ పేరు మార్మోగింది. అయితే ఆ తర్వాత ఆ రేంజ్ లో హిట్ పడలేదు.
చాలా రోజుల తర్వాత ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ సినిమాతో కన్నడ ప్రేక్షకులు ఊరట పొందారు. జూలై 21న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా యువతకి ఈ మూవీ కాన్సెప్ట్ కనెక్ట్ కావడంతో యూత్ ఎగబడి సినిమాని చూస్తున్నారు. క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీతో నితిన్ కృష్ణమూర్తి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. హీరో రక్షిత్ శెట్టి, ఒకప్పటి హీరోయిన్ రమ్య, ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టిలు అతిథి పాత్రలలో నటించారు. ‘కాంతార’ మ్యూజిక్ డైరక్టర్ అజనీష్ లోక్నాథ్ ఈ మూవీని తన సంగీతంతో నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్లాడు.
ఇక ఈ కథ విషయనికి వస్తే, హాస్టల్ లో ఉండే యువకుల మధ్య సాగే కథ ఇది. అయిదుగురు కుర్రాళ్ళు హాస్టల్ లో ఒకే గదిలో ఉంటారు. అయితే అందులో ఒకరికి షార్ట్ ఫిల్మ్ ను తీయాలని అనుకుంటాడు. కానీ వారికి ఎగ్జామ్స్ ఉండటంతో మిగిలిన నలుగురు అందుకు ఒప్పుకోరు. ఆ టైమ్ లోనే హాస్టల్ వార్డెన్ మరణిస్తాడు. కానీ తన చావుకు ఈ అయిదుగురు కుర్రాళ్ళే కారణం అని ఒక లెటర్ రాసిపెట్టి చనిపోతాడు.
ఈ విషయం తెలిసి షాక్ అయ్యి, అందులో నుండి బయటపడడానికి సీనియర్ ను సాయం అడుగుతారు. ఆ తరువాత ఏం జరిగింది? అందులో నుండి అయిదుగురు కుర్రాళ్ళు బయటపడ్డారా? ఆ వార్డెన్ లెటర్ లో వీళ్ళే కారణం అని ఎందుకు రాశాడు? అనేది మిగతా కథ. దర్శకుడు ఈ మూవీ స్క్రీన్ ప్లేను సరదాగా నడిపించారు.
ఈ మూవీలోని ఒక అభ్యంతరకర సన్నివేశంలో సైంటిస్ట్ ఓపెన్హైమర్ భగవద్గీతలోని ఒక శ్లోకం చదువుతారు. అదే వివాదానికి దారి తీసింది. హిందువులకు అత్యంత పవిత్ర గ్రంథం అయిన భగవద్గీతలోని శ్లోకాన్ని అభ్యంతరకర సన్నివేశంలో చదవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే సైంటిస్ట్ ఓపెన్హైమర్ తనకు ఇష్టమైన పుస్తకాలలో భగవద్గీత ఒకటని చెప్పారు. భగవద్గీతను చదవడం కోసమే ఆయన సంస్కృతం నేర్చుకున్నారని ఒక సందర్భంలో తెలిపారు. న్యూ మెక్సికోలోని ఎడారిలో తొలిసారి 1945లో జులై నెలలో అణుబాంబును పేల్చడానికి 2 రోజుల ముందు ఓపెన్హైమర్ భగవద్గీతలోని శ్లోకాన్ని చదివారట.
కొన్నేళ్లకు ముందు శాస్త్రవేత్త ఓపెన్హైమర్కు బర్క్లీలోని ఒక టీచర్ సంస్కృత భాషని పరిచయం చేశారు. ఆ తరువాత సంస్కృతంలోని భగవద్గీత ఓపెన్హైమర్కు పరిచయమైంది. భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలుంటాయి. భగవద్గీతను వరల్డ్ లోనే అత్యంత దీర్ఘ కవితగా పరిగణిస్తారు. అలాంటి భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని ఓపెన్హైమర్ ప్రపంచ చరిత్రను మార్చే ఒక ఘట్టం మొదలుపెట్టడానికి చదివి తనపై ఉన్న తీవ్రమైన ఒత్తిడిని తొలగించుకున్నాడని తెలుస్తోంది.
కమెడియన్ యాదమ్మ రాజు పటాస్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత జబర్దస్త్, అదిరింది, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. ప్రేమించి, పెళ్లి చేసుకున్న యాదమ్మ రాజు, తన భార్య స్టెల్లాతో కలిసి యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించాడు. అందులో సరదా వీడియోలను ఆడియెన్స్ తో పంచుకుంటాడు. యాదమ్మ రాజు ప్రస్తుతం జబర్దస్త్ లో టీం లీడర్ గా ఉన్న సంగతి తెలిసిందే.
యాదమ్మ రాజు భార్య తాజాగా ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోని చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆ వీడియో యాదమ్మ రాజు హాస్పిటల్లో ఉన్నట్టుగా కనిపించాడు. అతని కాలికి దెబ్బ తగిలి, పెద్ద కట్టుతో ఉన్న రాజు నడవలేని స్థితిలో కనిపించారు. అతని భార్య స్టెల్లా అతనిని నడిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆయనకు ఏమైందని అడుగుతున్నారు. దాంతో రాజు భార్య స్టెల్లా ఇలా వివరణ ఇచ్చారు.
యాదమ్మ రాజు చిన్నప్రమాదానికి గురయ్యారని, త్వరలో కోలుకుంటారు. మాపై చూపిస్తున్న మీ ప్రేమకు ధన్యవాదాలు. ఆయన త్వరగా కోలుకోవాలని పంపిన సందేశాలకు కృతజ్ఞతలని స్టెల్లా కామెంట్ చేశారు. గాయపడిన తన భర్తను ఉద్దేశిస్తూ, నీ పక్కన నేను ఉండగా నీకేం కాదు డియర్ అంటూ ఈ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు గెట్ వెల్ సూన్ అని కామెంట్స్ చేస్తున్నారు.
నటుడు మరియు దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన సినిమా బ్రో. తొలిసారిగా మామ, మేనల్లుడు కలిసి నటిస్తున్న మూవీ కావడంతో బ్రో సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన 2 పాటలకు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. గత కొద్ది రోజుల నుండి మూవీ ప్రమోషన్స్ సాగుతున్నాయి. వాటిలో భాగంగా దర్శకుడు సముధ్రఖని, సాయి ధరమ్ తేజ్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ‘బ్రో’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ ఈవెంట్ లో పవర స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ విశేషాల గురించి ఉత్సాహంగా మాట్లాడారు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ, ఎమోషనల్ అయ్యాడు.
చీఫ్ గెస్ట్ గా హాజరు అయిన వరుణ్ తేజ్ మాట్లాడుతూ సినిమాల్లో ఉన్నా, పాలిటిక్స్ లో ఉన్నా మా ఫ్యామిలీ అంతా బాబాయి వెనకే ఉంటాం అని చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే బ్రో ప్రీ రిలీజ్ వేడుక పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
ఎన్టీఆర్ ఆహారపు అలవాట్ల గురించి విన్నవారు షాక్ అయ్యేవారంట. ఎన్టీఆర్ ఉదయాన్నే అరచేతి మందం ఉండే ఇడ్లీలను 20కి పైగా అవలీలగా తినేవారంట. పొద్దున్నే 6 గంటలు అయ్యేసరికి మేకప్ వేసుకుని సిద్దంగా ఉండేవారు. ఆ తర్వాత షూటింగ్ కి వెళ్లి పగలు 2 గంటల అనంతరం మరో షూటింగ్ కు వెళ్ళేవారంట.
ఎన్టీఆర్ షూటింగ్ గ్యాప్ లో నిత్యం నాలుగైదు ఆపిల్ జ్యూస్ లు తాగేవారట. సాయంత్రం పూట స్నాక్స్ గా బజ్జీలు కానీ, డ్రై ఫ్రూట్స్ ను కానీ తీసుకునేవారు. ఎన్టీఆర్ రోజుకు 30 – 40 బజ్జీలు తింటుంటే అందరూ ఆయనను ఆశ్చర్యంగా చూసేవారట. ప్రతిరోజూ ఎన్టీఆర్ 2 లీటర్ల బాదం పాలు ఖచ్చితంగా తాగేవారట. అదే ఎండాకాలంలో అయితే ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు వేరే విధంగా ఉండేవట.
ఎండాకాలంలో మధ్యాహ్నం పూట ఎన్టీఆర్ మామిడి పళ్ల జ్యూస్ తో తాగేవారంట. అది మాత్రమే కాకుండా ఆ మామిడి పళ్ల జ్యూస్ లో గ్లూకోజ్ పౌడర్ ను కలిపి తాగేవారు. వైద్యుల సూచనల మేరకు అల్లం వెల్లుల్లి కలిపి చేసిన పేస్ట్ ను ఎన్టీఆర్ తీసుకునేవారట. ఆ ముద్దను ఎన్టీఆర్ షాట్ గ్యాప్ లో తినేవారట. ఎన్టీఆర్ తన కెరీర్లో 300లకు పైగా సినిమాలలో నటించారు. ఆయన హీరోగా నటించే సమేమాలో అత్యధిక పారితోషికం తీసుకునేవారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలోని శింగమనల నాగుల గడ్డకు చెందిన సాకే భారతి, ఆమె భర్త ప్రోత్సాహంతో శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీలో కెమిస్ట్రీలో పిహెచ్డి పూర్తి చేసి, గవర్నర్ చేతుల మీదుగా పట్టా అందుకోవడంతో ఆమె వెలుగులోకి వచ్చింది. ఆమె ఎలాంటి కోచింగ్ కు వెళ్లలేదు. కెమిస్ట్రీని చదివి, పీహెచ్డీ చేసింది. ఆమెకు శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ పీహెచ్డీ పట్టాను అందచేశారు.
వేదిక పైకి భారతి భర్త, కూతురుతో కలిసి వచ్చింది. పారగాన్ చెప్పులు వేసుకుని, సాదా చీర ధరించి వచ్చిన భారతి ఆహార్యాన్ని చూసిన వేదిక పైన పెద్దలు, అతిథుల ముఖాల్లో ఆశ్చర్యం. ఆ తరువాత లక్ష్యసాధనకు పేదరికం అడ్డంకి కాదని నిరూపించిన భారతిని చూసి సంతోషపడ్డారు. భారతి చిన్నతనం నుండే బాగా చదువుకోవాలని కోరుకునేది. టెన్త్ క్లాస్ వరకు ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకుంది.
ఆమె తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు. వారిలో భారతి పెద్దది. బాధ్యతల భారం, కుటుంబ ఆర్థిక స్థితి బాగోలేకపోవడంతో ఆమెకు మేనమామ శివప్రసాద్తో పెళ్లి చేశారు. ఆమె భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నది. కానీ వాటి గురించి భర్తకు చెప్పలేదు. కానీ శివప్రసాద్ భారతి కోరికను అర్థం చేసుకుని, పై చదువులు చదివడానికి ప్రోత్సాహన్ని అందించాడు.
భారతి తమ జీవితాలను మార్చుకోవడం కోసం ఇదే ఒక మంచి అవకాశం అని భావించింది. కానీ భర్త ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. దాంతో ఆమె కొన్నిరోజులు కూలీ పనులకు వెళ్ళేది. మరి కొన్ని రోజులు కాలేజీకి వెళ్తూ డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. అప్పటికే ఆమెకు ఒక కూతురు. ఆమె ఆలనా పాలనా చూస్తూనే భారతి అటు చదువు, ఇటు కులీ పనులు, ఇంటి పనులు సమన్వయం చేసేది. రోజూ అర్ధరాత్రి వరకూ చదువుకునేది. మళ్లీ పొద్దున్నే లేచి మళ్ళీ చదువుకునేది. ఇక కాలేజీకి వెళ్లాలంటే ఆమె ఉండే ఊరి నుండి 28 కిలో మీటర్లు ప్రయాణం చేయాలి.
వారిది రవాణా ఖర్చులు కూడా భరించలేని పరిస్థితి. దాంతో భారతి 8 కిలోమీటర్ల దూరంలో ఉండే గార్లదిన్నె ఊరు వరకు నడిచి, అక్కడ బస్సు ఎక్కేది. ఇన్ని కష్టాల మధ్య ఆమె డిగ్రీ మరియు పీజీ మంచి మార్కులతో పాస్ అయ్యింది. ఆమె ప్రతిభను చూసిన భర్త శివప్రసాద్, ప్రొఫెసర్లు భారతిని పీహెచ్డీ చేసే దిశగా ఆలోచించమని చెప్పారు. అలా ప్రయత్నించగా ఆమెకు ప్రొఫెసర్ డా.ఎంసీఎస్ శుభ వద్ద ‘బైనరీ మిక్చర్స్’ అనే అంశం పై పరిశోధనకు అవకాశం వచ్చింది.
పీహెచ్డీ కోసం వచ్చే ఉపకార వేతనం ఆమెకి కొంత వరకు సాయపడింది. అయినా భారతి కూలి పనులు చేయడం మానలేదు. ‘‘డాక్టరేట్ చేస్తే యూనివర్సిటీ స్థాయిలో జాబ్ పొందవచ్చు. ఆ ఉద్యోగం మా జీవితాలను బాగు చేస్తుంది. తాను నేర్చుకున్న జ్ఞానాన్ని ఎందరికో పంచే అవకాశం ఉంటుంది. తాను సాధించిన విజయం తన లాంటి వారెందరికో ప్రేరణను ఇస్తుంది” అని భారతి చెప్పుకొచ్చారు.
పమ్మి సాయి అసలు పేరు శ్రీనివాస్ సాయిరామ్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంతూరు భీమవరం అనే విషయం తెలిసిందే. పమ్మి సాయి ఊరు కూడా అదే కావడంతో అతనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చిన్నతనం నుండి పరిచయం ఉంది. పమ్మి సాయికి ఆ పరిచయాన్నితోనే సరదాగా మహేష్ బాబు నటించిన ‘అతడు’ మూవీలో త్రివిక్రమ్ మొదటి ఛాన్స్ ఇచ్చారు. ఆ విధంగా సరదాగా మొదలైన పమ్మి సాయి కెరీర్ ప్రస్తుతం కొనసాగుతోంది.
మొదటి ఛాన్స్ ఇచ్చి వదిలిపెట్టకుండా త్రివిక్రమ్ వరుసగా తన చిత్రాలన్నిటిలోనూ పమ్మి సాయికి మంచి పాత్రలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ‘నువ్వే నువ్వే’ సినిమాలో తప్ప పమ్మీ సాయి త్రివిక్రమ్ దర్శకత్వం చేసిన అన్నిచిత్రాలలో నటించాడు. అలాగే ఇతర డైరక్టర్ల సినిమాలలో కూడా మంచి ఆఫర్స్ లభించాయి. అలా పమ్మి సాయి ఛలో, చల్ మోహనరంగా, శతమానం భవతి, ఎవరు లాంటి సుమారు 60 పైగా సినిమాలలో మంచి కామెడీ పాత్రలు చేశారు.
త్రివిక్రమ్ మూవీ చివరగా రిలీజ్ అయ్యి, సంచలన విజయాన్ని సాధించిన ‘అల వైకుంఠపురంలో పోషించిన పాత్రతో కూడా పమ్మి సాయికి మంచి పేరు తెచ్చింది. అల్లు అర్జున్, పూజా హెగ్డే పోలీస్ స్టేషన్ కి వెళ్ళినపుడు వచ్చే ఒక్క సన్నివేశంలో మాత్రమే కనిపించి నవ్వులు పూయించాడు.