నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒకేసారి స్క్రీన్ పై బాలకృష్ణ, ఎన్టీఆర్..!

నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒకేసారి స్క్రీన్ పై బాలకృష్ణ, ఎన్టీఆర్..!

by Megha Varna

Ads

నందమూరి అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఒకే వేదిక మీద బాబాయి, అబ్బాయి కనిపించనున్నారు. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ సస్పెన్స్ థ్రిల్లెర్స్ ని తీసుకువచ్చి విజయవంతంగా ఆహా దూసుకెళ్లి పోతోంది. ఒకపక్క వెబ్ సిరీస్ తో పాటుగా మరొక పక్క షోస్ ని కూడా తీసుకు వస్తోంది. ఇది ఇతర ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి గట్టి పోటీని కూడా ఇస్తోంది.

Video Advertisement

ఈసారి నందమూరి నటసింహం బాలకృష్ణ తో ఒక టాక్ షోను ఆహా తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ టాక్ షో కి సంబంధించి మొట్టమొదటి ఎపిసోడ్ ప్రోమో కూడా ఆదివారం వచ్చేసింది. దానితోనే చాలామందికి ఇంట్రెస్ట్ కూడా పెరిగిపోయింది. నవంబర్ 4 నుంచి ఇది ప్రసారం కానుంది. మొదటి ఎపిసోడ్ ప్రోమోలో బాలయ్య లుక్ నిజంగా అదిరిపోయింది.

 

షో కి సంబంధించి మొదటి ఐదు ఎపిసోడ్స్ కి వచ్చే గెస్ట్స్ ని ఫైనల్ చేశారు. అయితే వాళ్లలో ఎన్టీఆర్ పేరు వినబడుతోంది. మొదటి ఎపిసోడ్ లో మంచు ఫ్యామిలీతో బాలకృష్ణ రాబోతున్నాడు. రెండవ ఎపిసోడ్ లో రానా, మూడవ ఎపిసోడ్ లో నాని వస్తున్నట్లు తెలుస్తోంది.

అదే విధంగా నాలుగో ఎపిసోడ్ లో ప్రభాస్ వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఎన్టీఆర్ ఐదవ ఎపిసోడ్ లో వస్తున్నట్లు తెలియగా కళ్యాణ్ రామ్ కూడా వాళ్ళతో జాయిన్ అవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇది ఇంకా ఫైనల్ కాలేదు. ఒకవేళ కనుక ఇది ఫిక్స్ అయితే నందమూరి అభిమానులకు పండగే.


End of Article

You may also like