బిగ్ బాస్-4: టీవీ 9 యాంకర్ “దేవి నాగవల్లి” గురించి ఈ విషయాలు తెలుసా?

బిగ్ బాస్-4: టీవీ 9 యాంకర్ “దేవి నాగవల్లి” గురించి ఈ విషయాలు తెలుసా?

by Mohana Priya

Ads

watch video:

Video Advertisement

ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రారంభమైంది. ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇంక కంటెస్టెంట్స్ విషయానికొస్తే సోషల్ మీడియాలో ఎంతోకాలం నుండి ఎన్నో పేర్లు వైరల్ అయ్యాయి. అలా వైరల్ అయిన లిస్టులో ఉన్న కంటెస్టెంట్స్ లో కొంతమంది నిజంగానే బిగ్ బాస్ లో ఉన్నారు. అలాగే ముందుగా ఎంపిక చేసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ల లో కొంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో చివరి నిమిషంలో వాళ్లని వేరే కంటెస్టెంట్స్ రీప్లేస్ చేశారు అనే వార్త కూడా ప్రచారం అవుతోంది.

ఏదేమైనా ఇవన్నీ తెర వెనక విషయాలు కాబట్టి వీటి గురించి అధికారికంగా షో యాజమాన్యం ఎవరూ మాట్లాడరు. కంటెస్టెంట్లు అందరూ వేరు వేరు బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చారు. వాళ్లని మనం తెరపై చూడటం తప్ప వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి ఆ వ్యక్తి బయటికి చెప్పేంత వరకు ఎవరికీ తెలియదు. ఇవాళ షో ఇంట్రడక్షన్ లో కంటెస్టెంట్స్ తమ గురించి చెప్పారు. అందులో అందరూ క్యూరియస్ అయింది మాత్రం దేవి నాగవల్లి గురించి.

దేవి నాగవల్లి మనందరికీ టీవీ9 రిపోర్టర్ గా మాత్రమే తెలుసు. దాడి జరిగిన ప్రదేశం అయినా, లేదా ఇంకెక్కడికైనా సరే ధైర్యంగా వెళ్లి న్యూస్ ప్రజెంట్ చేయగలరు, ఎదురుగా ఎంత పెద్ద సెలబ్రిటీ ఉన్నా కూడా ఎటువంటి భయం లేకుండా మాట్లాడగలరు. దానికి అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ దేవరకొండ తో చేసిన ఇంటర్వ్యూ, రామ్ గోపాల్ వర్మ, ఆ తర్వాత కే ఏ పాల్ తో చేసిన ఇంటర్వ్యూలే ఉదాహరణ. తన హెయిర్ స్టైల్, ఆహార్యం కొంచెం భిన్నంగా ఉంటాయి.

మనకి దేవి నాగవల్లి గురించి తెలిసింది ఇది మాత్రమే. కానీ బిగ్ బాస్ ఇంట్రడక్షన్ లో తన వ్యక్తిగత జీవితం లో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు. రాజమండ్రికి చెందిన దేవి నాగవల్లి మాస్ కమ్యూనికేషన్ లో డిప్లమో చేశారు. టీవీ9 తో తన కెరీర్ ని మొదలు పెట్టారు. వృత్తి లో భాగంగా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేశారు, అలాగే టెర్రర్ ఎటాక్ తర్వాత అమర్ నాథ్ వెళ్లి అక్కడి నుండి న్యూస్ రిపోర్టింగ్ చేశారు.

దేవి నాగవల్లి ది అరేంజ్డ్ మ్యారేజ్ అని, తర్వాత యూఎస్ఏ కి వెళ్లారని, కానీ కొన్ని కారణాల వల్ల పెళ్లైన కొంతకాలానికి మ్యూచువల్ డివోర్స్ తీసుకొని విడిపోయారని, ఇప్పుడు తనకి ఆరేళ్ల కొడుకు ఉన్నాడు అని, నెల తిరిగే సరికి జీతం డబ్బులు అయిపోతాయి అని, ఇంటి లోన్, ఇంకా మిగతా వాటిని కట్టడానికి కష్టంగా ఉండటంతో బిగ్ బాస్ ప్రైజ్ మనీ కోసం తను ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పారు దేవి నాగవల్లి.

2009 లో నేషనల్ టెలివిజన్ అవార్డ్ (ఢిల్లీ) ని గెలుచుకున్నారు. 2009 లో, 2010 లో వరసగా నంది అవార్డులను గెలుచుకున్నారు. నేషనల్ టెలివిజన్ అవార్డ్ ఇంకా నంది అవార్డు అందుకున్న తొలి తెలుగు న్యూస్ రిపోర్టర్ గా నిలిచారు. ఇప్పటివరకు రిపోర్టర్ దేవి నాగవల్లి గానే మనందరికీ తెలుసు. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ దేవి నాగవల్లి ఎలా ఉంటారో వేచి చూద్దాం.


End of Article

You may also like