నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ పై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్…ఫుల్ ఛార్జ్ ఇచ్చి వాడుకుంటా?

నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ పై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్…ఫుల్ ఛార్జ్ ఇచ్చి వాడుకుంటా?

by Mohana Priya

Ads

బిగ్ బాస్ సీజన్ 4 మొదలయ్యి అప్పుడే రెండు వారాలు గడిచాయి. మొదటి వారం తో పోలిస్తే ఈ వారం లో దాదాపు అందరు కంటెస్టెంట్స్ ఓపెన్ అప్ అయ్యారు. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ లో  మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఈ రోజుల్లో, బస్టాప్, బ్రాండ్ బాబు సినిమాల్లో నటించిన కుమార్ సాయి, జబర్దస్త్ ఫేమ్ అవినాష్ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. మొదటి వారం లో సూర్య కిరణ్ ఎలిమినేట్ అవ్వగా , రెండవ వారం నామినేషన్స్ లో కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యారు.

Video Advertisement

నిన్నటి ఎపిసోడ్ లో రోబో టీమ్ నుండి వచ్చిన అవినాష్ మనుషుల టీం వాళ్ళతో మాటలు కలిపి అమ్మ రాజశేఖర్ తో మాట్లాడుతునే తెలియకుండా చార్జింగ్ పెట్టేసుకున్నారు. తర్వాత సుజాత తను వాష్ రూమ్ కి వెళ్ళాలి అని, రాత్రంతా కూడా టాబ్లెట్ వేసుకోకుండా అలానే ఉన్నాను అని, రోబోల టీం కి ఛార్జింగ్ ఇస్తాను అని అనడంతో సుజాత కి సోహెల్ కి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది.

టాస్క్ పూర్తయిన తర్వాత రోబో టీమ్ లో గంగవ్వ ఇంకా అభిజిత్ చార్జింగ్ ఉండడంతో, రోబో టీం ని విజేతలుగా ప్రకటించారు బిగ్ బాస్. బెస్ట్ పర్ఫార్మర్స్ గా గంగవ్వ, హారిక, అభిజిత్, అవినాష్ ని ఇంటి సభ్యులు ఎంపిక చేశారు. వరస్ట్ పర్ఫార్మర్ ఎవరు అని ఇంటి సభ్యులని అడిగితే అందరూ నోయల్ పేరు చెప్పడంతో, నోయల్ కి జైలు శిక్ష వేశారు. నిన్నటి ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4 #5


End of Article

You may also like