గత మూడు బిగ్ బాస్ సీజన్లలో పార్టిసిపేట్ చేసిన ఈ కంటెస్టెంట్స్ గుర్తున్నారా?

గత మూడు బిగ్ బాస్ సీజన్లలో పార్టిసిపేట్ చేసిన ఈ కంటెస్టెంట్స్ గుర్తున్నారా?

by Mohana Priya

Ads

సెప్టెంబర్ ఆరవ తేదీ నుండి బిగ్ బాస్ మొదలవుతుంది అని అఫీషియల్ గా స్టార్ మా నుండి స్టేట్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి గత మూడు సీజన్లలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరు విజేతగా నిలిచారు, హోస్ట్ ఎవరు అనే విషయంపై ఒకసారి రీక్యాప్ చేసేద్దాం.

Video Advertisement

2017 లో మొదలైన బిగ్ బాస్ సీజన్ వన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఆ సీజన్ లో అర్చన, హరితేజ, సమీర్, శివ బాలాజీ, మధుప్రియ, కత్తి మహేష్, కల్పన,  ఆదర్శ్, దీక్ష పంత్, నవదీప్, ధనరాజ్, ముమైత్ ఖాన్, కత్తి కార్తీక, ప్రిన్స్, సంపూర్ణేష్ బాబు, జ్యోతి పాల్గొన్నారు. ఇందులో నవదీప్, దీక్ష పంత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ వన్ లో శివ బాలాజీ విజేతగా నిలిచారు.

2018 లో మొదలైన బిగ్ బాస్ సీజన్ టు కి నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఆ సీజన్ లో భాను శ్రీ, బాబు గోగినేని, గీత మాధురి, దీప్తి, పూజ రామచంద్రన్, కౌశల్, దీప్తి సునైనా, తనీష్, సామ్రాట్, తేజస్వి, కిరీటి దామరాజు, రోల్ రైడా, అమిత్ తివారి, నందిని రాయ్,సంజన అన్నె, గణేష్, నూతన్ నాయుడు, శ్యామల పాల్గొన్నారు. ఇందులో నందిని రాయ్, పూజా రామచంద్రన్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా వచ్చారు. ఈ సీజన్ లో కౌశల్ విజేతగా నిలిచారు.

2019 లో మొదలైన బిగ్ బాస్ సీజన్ 3 కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సీజన్ లో పునర్నవి భూపాలం, వరుణ్ సందేశ్, వితిక షేరు, శివ జ్యోతి, అలీ రెజా, రవి కృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, హిమజ, శిల్ప చక్రవర్తి, అషు రెడ్డి, హేమ, తమన్నా సింహాద్రి, మహేష్ విట్ట, జాఫర్, శ్రీముఖి, రోహిణి, బాబా భాస్కర్ పాల్గొన్నారు. ఇందులో తమన్నా సింహాద్రి, శిల్ప చక్రవర్తి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా వచ్చారు. ఈ సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచారు.

ఇంకొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ ఫోర్ మొదలవబోతోంది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఇప్పటికే క్వారంటైన్ లో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ పేర్లు బయటికి వచ్చాయి. కానీ నిజంగా అందులో ఉన్న వాళ్లే వస్తున్నారా? లేదా? అన్న విషయం  తెలుసుకోవాలి సెప్టెంబర్ 6వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.


End of Article

You may also like