కొండ మీద నుండి దూసుకొచ్చిన మృత్యువు.. ఆఖరికి..?

కొండ మీద నుండి దూసుకొచ్చిన మృత్యువు.. ఆఖరికి..?

by Megha Varna

Ads

ప్రమాదం ఎప్పుడు ఎలా కలుగుతుంది అనేది ఎవరూ ఊహించలేము. ఆనందంగా ఉన్న క్షణాలు తారుమారై పోవడానికి ఒక్క క్షణం చాలు. మనం ఏ తప్పూ చేయకుండా జాగ్రత్తగా వెళ్తున్నా సరే టైం బ్యాడ్ అయితే ఏదైనా జరగొచ్చు. నిజానికి ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.

Video Advertisement

దీంతో అక్కడికక్కడే ఒకరు ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇంతకీ అసలు ఏమైంది..?, మృత్యువు ఏ రూపం లో వచ్చింది..?, అసలు ఎలా ప్రాణాన్ని కోల్పోయారు అనే దాని గురించి చూద్దాం.

కేరళ లోని కొండ ప్రాంతాన్ని చూడాలని ఆనందంగా నలుగురు ఫ్రెండ్స్ బండి మీద బయలుదేరారు. ఇద్దరు స్నేహితులు ఒక బండి మీద మరో ఇద్దరు స్నేహితులు ఒక బండి మీద ఇలా రెండు బండ్ల మీద కొండ ప్రాంతాన్ని చూడటానికి వెళ్లారు. చక్కగా ప్రకృతిని చూసుకుంటూ కొండల మధ్య నుండి ఆనందంగా వెళ్తున్న ఈ నలుగురు స్నేహితుల కి షాక్ తగిలింది.

ముందు వెళ్తున్న బండి మీద ఇద్దరు ఫ్రెండ్స్ ఉండగా వాళ్ళకి వెనక వెళ్తున్న ఇద్దరు స్నేహితులు కూడా వీడియో తీస్తున్నారు. కేరళ లోని కొండ ప్రాంతాన్ని చూడడానికి వెళుతున్న వీరికి షాక్ తగిలింది. ముందు వెళ్తున్న బండికి అడ్డంగా కొండ పై నుంచి బండ రాయి దొర్లుకుంటూ వారి మీద పడడంతో వాళ్లిద్దరూ కూడా లోయ లో పడిపోయారు. వాళ్ళను అభినవ్, అనీష్ గా గుర్తించారు. తామరస్సేరి ఘాట్ రోడ్డు పైన ఇది చోటు చేసుకుంది. అభినవ్ అక్కడికక్కడే చనిపోయాడు. అనీష్ కి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

watch video:


End of Article

You may also like