పెళ్లికి పెండ్లికొడుకు రాలేదని పెళ్లికూతురు చేసిన పని చూస్తే షాక్ అవుతారు..! అసలు ట్విస్ట్ ఏంటంటే.?

పెళ్లికి పెండ్లికొడుకు రాలేదని పెళ్లికూతురు చేసిన పని చూస్తే షాక్ అవుతారు..! అసలు ట్విస్ట్ ఏంటంటే.?

by Megha Varna

పీటల దాకా వచ్చిన పెళ్లిళ్లు కూడా ఆగిపోవడం మనం చూసే ఉంటాం. అయితే అలా పెళ్లికి రాకుండా డుమ్మా కొట్టిన వరుడికి బుద్ధి చెప్పింది యువతి. అది చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. అయితే అసలు ఏమైంది అనేది చూస్తే… రిజిస్టర్ ఆఫీస్ లో అప్పటికే వివాహం అయిపోయింది.

Video Advertisement

ఆ తర్వాత సాంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. దీంతో యువతి కుటుంబంలో పెళ్లి సందడి స్టార్ట్ అయ్యింది. పెళ్లి దుస్తులు ధరించిన వధువు వరుడు కోసం ఎదురు చూస్తోంది. సమయం దాటి పోతున్నా సరే వరుడు ఇంకా రావడం లేదు. దీనితో అతని ఇంటికి వెళ్లి చూసింది. తాళం వేసి ఉండటంతో ఆ యువతి మోసపోయింది అని గ్రహించి..

ప్రియుడి ఇంటి ముందు పెళ్లి బట్టల్లో ధర్నాకు దిగింది. ఆ వరుడు వచ్చి అందరి ముందు ఆమెని వివాహం చేసుకుంటే కానీ అక్కడి నుంచి లేవనని తగ్గించేసింది. ఇప్పటికీ ఆమె ధర్నా మొదలుపెట్టి రెండు రోజులు అయింది. ఆ వరుడు గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ ఎలాంటి జాడ తెలియలేదు. ఆ యువతి మాత్రం భీష్మించుకుని కూర్చోవడంతో పోలీసులు వెళ్లారు.

ఆమెకి నచ్చచెప్పాలని కూడా చూశారు. కానీ ఆమె వాళ్ళపై మండిపడడంతో అవాక్కయ్యారు. చివరికి ఏం చేయాలో తోచక పోలీసులు ఇద్దరు కానిస్టేబుల్స్ ని అక్కడ ఉంచారు. ఈ ఘటన ఒడిశాలోని బెర్హంపూర్ లో చోటుచేసుకుంది. బాధితురాలు డింపుల్ సుమిత్ సాహూ నేను సెప్టెంబర్ 7, 2020న రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నామని అంది.

ఆ తర్వాత అత్తమామల వేధింపులు మొదలయ్యాయని అంది. ఆ తర్వాత భర్త కూడా ఆమెని వేధించాడని అంది. మహిళా పోలీస్ స్టేషన్ లో ఈ విషయంపై ఆమె ఫిర్యాదు కూడా చేసింది. అయితే పుట్టింట్లో ఉన్న ఆమెను మామ గారు కలిసి జరిగినవి మర్చిపోదాం అని ఆచార సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిపిద్దాం అని చెప్పారు అంది. అయితే పెళ్లి సమయానికి తన భర్త ఆ కుటుంబంతో పాటు కనపడకుండా వెళ్లిపోయారని చెప్పిందామె.


You may also like