Home News సీతక్క మంత్రి అయింది… తన స్వగ్రామానికి బస్సు వచ్చింది…!

సీతక్క మంత్రి అయింది… తన స్వగ్రామానికి బస్సు వచ్చింది…!

by Sainath Gopi

ధనసరి అనసూయ సీతక్క… ములుగు నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించింది. సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా అవకాశం కూడా దక్కించుకుంది. అయితే సీతక్క స్వగ్రామం ములుగు లోని జగ్గన్నపేట గ్రామం. ఈ గ్రామానికి ఇప్పటివరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. గ్రామానికి వెళ్లేందుకు అనువైన రోడ్లు ఉన్నా కూడా ఆర్టీసీ బస్సు అనేది ఈ గ్రామానికి రాదు.

public response for seethakka oath

అయితే సీతక్క మంత్రి అయిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. వెంటనే స్పందించిన ఆర్టీసీ అధికారులు జగ్గన్నపేట గ్రామానికి వెళ్లి రహదారిని రూట్ ను పరిశీలించారు. వరంగల్ డిపో మేనేజర్ మాట్లాడుతూ త్వరలో ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం వస్తుందని తెలియజేశారు.

తెలంగాణలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సీతక్క మంత్రి అయ్యాక తన స్వగ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తే ఆ గ్రామ ప్రజలకు మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సీతక్క మంత్రి అయిందో లేదో తమ గ్రామానికి వెంటనే ఆర్టీసీ బస్సు రాబోతుంది అంటూ జగ్గన్నపేట గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.పత్తిపల్లి-పొట్లాపూర్ మార్గంలో బస్సు అందుబాటులోకి రానుంది.

You may also like