Ads
రోజు రోజుకి మోసాలు ఎక్కువై పోతున్నాయి. ఎంతో తెలివిగా డబ్బుని దోచుకుంటున్నారు. అయితే ఒక పారిశ్రామికవేత్త ఇంటికి సున్నం కొట్టడానికి వెళ్లిన నలుగురు కార్మికులు ఆ ఇంటికి కన్నం వేసి ఏకంగా 2.5 కోట్ల రూపాయల నగదుని దోచుకెళ్లారు. ఆలస్యంగా ఇది బయట పడింది. అయితే మరి పూర్తి వివరాల్లోకి వెళితే…
Video Advertisement
తిరుప్పూర్కు చెందిన దురైస్వామి (56) పారిశ్రామిక వేత్త. బనియన్ ఉత్పత్తి పరిశ్రమలు మరియు నూలు ఉత్పత్తి పరిశ్రమలు దురైస్వామి కి ఉన్నాయి. ఈ మధ్యనే పారిశ్రామిక వేత్త దురైస్వామి కుమార్తె పెళ్ళి అయ్యింది.
వాళ్ల ఇంట్లో భార్య ధనలక్ష్మి తో పాటుగా దురైస్వామి మరియు కొంత మంది నౌకర్లు ఉంటారు. అయితే వాళ్లు ఇంట్లో ఉన్న నగదు, నగలు వంటి వాటిని లెక్కిస్తున్న సమయంలో నగదు, నగలు మాయమయ్యాయి అని గమనించారు. దీంతో చెన్నై పోలీసుల్ని ఆశ్రయించారు. తిరుప్పూర్కు కేసు బదిలీ అయ్యింది. అప్పుడు అసలు విషయం బయట పడింది.
దురైస్వామి కుమార్తె కి రెండు నెలల క్రితం పెళ్లి అయ్యింది. అయితే ఇంటిని శుభ్రం చేసేందుకు కార్మికులు వెళ్లారు. అలానే సున్నం కొట్టే వాళ్లు కూడా ఇందులో ఉన్నారు. సతీష్, దామోదరన్, శక్తి మరియు రాధాకృష్ణన్పై అనుమానం కలిగింది. వీళ్ళని పోలీసులు అదుపు లోకి తీసుకోగా బండారం బయట పడింది.
సున్నం కొట్టే సమయంలో దురై స్వామి ఇంట్లో ఒక రహస్య గది కనపడింది.. చూస్తే చిన్న సంచుల్లో రూ. 2 వేల నోట్లను మూటలు కట్టి పడేసి ఉన్నాయని… వాటిని తీసుకుని వెళ్లిపోయాం అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ నలుగుర్ని బుధవారం పోలీసులు అరెస్ట్ చేసారు. వీళ్ళు తీసుకెళ్లిన నగదు రూ. 2.5 కోట్లుగా ఉంటుందని తేల్చారు. నగదు ఎక్కడ దాచి ఉంచారు అనేవి తెలియాల్సి వుంది. 75 లక్షలు విలువైన బంగారంతో సంబంధం లేదన్నారు.
End of Article