బిగ్ బాస్ రైతు బిడ్డ “పల్లవి ప్రశాంత్” కు అన్ని ఆస్తులు ఉన్నాయా..?

బిగ్ బాస్ రైతు బిడ్డ “పల్లవి ప్రశాంత్” కు అన్ని ఆస్తులు ఉన్నాయా..?

by kavitha

Ads

బిగ్ బాస్ సీజన్ 7వ సీజన్ ఇటీవల గ్రాండ్ గా ప్రారంభమైన  విషయం తెలిసిందే. ఇప్పటికే బిగ్ బాస్ మొదలయ్యి  రెండు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. తొలి వారం హీరోయిన్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా, రెండవ వారం  షకీలా ఎలిమినేట్ అయ్యింది.

Video Advertisement

అయితే బిగ్ బాస్ హౌస్ లో అంతమంది పోటీదారులు ఉన్నప్పటికీ రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం రైతుబిడ్డ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాడు. పల్లవి ప్రశాంత్ ఆస్తుల గురించిన వార్త వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ సంచలనంగా మారాడు. సెలెబ్రెటీ కానప్పటికీ.  సాధారణ వ్యక్తిగా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన ప్రశాంత్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు. షో ప్రారంభం అయ్యి, రెండు వారాలు పూర్తి కాగా, రెండుసార్లు ప్రశాంత్ నామినేషన్స్ లో నిలిచాడు. కానీ టోటల్ ఓటింగ్ లో నలబై శాతం ఓట్లు అతనికే వస్తున్నాయని సమాచారం.
పల్లవి ప్రశాంత్ బలమైన కంటెస్టెంట్ అని హౌజ్ మెంబర్స్ ఇప్పటికే పసిగట్టారు. దాంతో జనాల్లో రైతుబిడ్డ పై సింపథీ పోగొట్టడానికి ట్రై చేస్తున్నారు. అందుకే రెండవ వారం నామిషన్స్ లో రితికా రోజ్, అమర్ దీప్ చౌదరి, ప్రియాంక, తేజా, శివాజీతో పాటు కొందరు ప్రశాంత్  పై అటాక్ చేశారు. సింపథీ మాటలు మాట్లాడవద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు.  అయినా ప్రశాంత్ కున్న క్రేజ్ తగ్గకపోగా మరింతగా పెరిగిందని తెలుస్తోంది.
పల్లవి ప్రశాంత్ తెలంగాణకు చెందిన వ్యక్తి. రైతుబిడ్డగా పాపులర్ అయిన ప్రశాంత్ ఫ్యామిలీ కాస్త డబ్బు ఉన్న ఫ్యామిలీ  అని సమాచారం. పల్లవి ప్రశాంత్ కి దాదాపు 26 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉందని అంటున్నారు. అది మాత్రమే కాకుండా సొంత ఊరిలో పెద్ద ఇల్లుతో పాటుగా, కాస్ట్లీ లగ్జరీ కారు కూడా ఉందని టాక్. ప్రశాంత్ పొలం, హౌజ్ విలువ కోట్లలో ఉంటుందని అంటున్నారు. ప్రశాంత్ వ్యవసాయ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తాయని టాక్. ఈ న్యూస్ లో నిజమెంతో తెలియదు కానీ నెట్టింట్లో వైరల్ గా మారింది.

Also Read: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన 7/జి బృందావన్ కాలనీ హీరో..? ఇప్పుడు ఎలా ఉన్నారంటే..?


End of Article

You may also like