Ads
సోషల్ మీడియా అనేది కొన్ని విలువైన విషయాలను చెప్పడానికి ఒక ఆయుధంలా ఉపయోగపడుతుంది. కానీ కొన్ని సార్లు మాత్రం అనవసరమైన విషయాలకి సెలబ్రిటీలని పాయింట్ చేసి ట్రెండ్ చేయడానికి ఒక మాధ్యమం కూడా అవుతోంది. అలా కొంత మంది సినీ ప్రముఖులు ఇటీవల సోషల్ మీడియాలో నెగిటివ్ గా ట్రెండ్ అయ్యారు. వాళ్ళు ఎవరో, వాళ్ళు అలా ట్రెండ్ అవ్వడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 ఆలియా భట్
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత 8 సంవత్సరాల క్రితం కాఫీ విత్ కరణ్ షోలో అలియా భట్ అన్న ఒక మాట వైరల్ అయ్యింది. ఈ క్లిప్ తర్వాత ఆలియా భట్ నటించిన సడక్ 2 సినిమాపై కూడా ప్రభావం చూపింది.
#2 సమంత అక్కినేని
తమిళం మనోభావాలు దెబ్బ తీసేలా సమంత పాత్ర ఉంది అంటూ సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 పై గొడవ అయ్యింది.
#3 రాధిక ఆప్టే
రాజ్ కుంద్రా వివాదంలో స్పందించలేదు అంటూ రాధిక ఆప్టే పై ట్రెండ్ మొదలుపెట్టారు.
#4 నాని
బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరించిన నాని, కౌశల్ విషయంలో పక్షపాతంగా వ్యవహరించారు అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు.
#5 కరీనా కపూర్
కరీనా కపూర్ ఒక ముస్లిం ని పెళ్లి చేసుకున్నారు అని, తను సీత పాత్ర పోషించకూడదు అని సోషల్ మీడియాలో “బాయ్ కాట్ కరీనా కపూర్” అని ట్రెండ్ చేశారు.
#6 రియా చక్రవర్తి
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంలో రియా చక్రవర్తి హస్తం ఉంది అని సోషల్ మీడియాలో చాలా కాలం నుండి ట్రెండ్ అవుతున్నారు.
#7 స్వర భాస్కర్
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కూడా జె ఎన్ యు విషయంపై మాట్లాడడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు.
#8 పూజా హెగ్డే
సౌత్ ఇండియన్స్ కి నడుము ఫాంటసీ ఉంది అని ఒక ఇంటర్వ్యూలో పూజా హెగ్డే తెలపడంతో, సోషల్ మీడియాలో చాలా మంది నెగిటివ్ గా కామెంట్ చేశారు. తర్వాత పూజ హెగ్డే ఆ స్టేట్మెంట్ కి వివరణ ఇచ్చారు.
#9 సోనమ్ కపూర్
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కూడా కాఫీ విత్ కరణ్ షోలో “సుశాంత్ అంటే ఎవరు?” అని అడిగినందుకు, సుశాంత్ మరణం తర్వాత సోషల్ మీడియాలో సోనమ్ పై చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
#10 పార్వతి తిరువోతు
మమ్ముట్టి గారు హీరోగా నటించిన ఒక మలయాళం సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయి అని చెప్పడంతో, మలయాళ నటి పార్వతి తిరువోతు పై మమ్ముట్టి అభిమానులు సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ గా కామెంట్స్ చేశారు.
వీరే కాకుండా ఇంకా ఎంతో మంది సెలబ్రిటీలు వింత కారణాలపై సోషల్ మీడియాలో నెగిటివ్ గా ట్రెండ్ అయ్యారు.
End of Article