చంద్రబాబు కేసు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా ఫీజు ఎంతో తెలుసా..? అంతకుముందు ఆయన వాదించిన కేసులు ఏవి అంటే..?

చంద్రబాబు కేసు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా ఫీజు ఎంతో తెలుసా..? అంతకుముందు ఆయన వాదించిన కేసులు ఏవి అంటే..?

by Megha Varna

Ads

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్టు చేసి, సిబిఐ కోర్టులో హాజరు పరచారు. వాద ప్రతివాదలు విన్న తరువాత సీబీఐ కోర్టు చంద్రబాబు నాయుడికి 14 రోజుల పాటు జ్యూడీషియల్ రిమాండ్ ను విధించింది. దీంతో చద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

Video Advertisement

అయితే ఈ కేసులో చంద్రబాబు తరుపున వాదించడానికి లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా డిల్లీ నుండి వచ్చారు. ఆయన మరెవరో కాదు సుప్రీంకోర్టు సినియర్ అడ్వకేట్. భారత్ లో టాప్ టెన్ పాపులర్ న్యాయవాదుల్లో సిద్ధార్ధ్ లుథ్రా ఒకరు. ఆయన కేసు వాదించడానికి ఎంత ఫీజు తీసుకున్నారో? ఇప్పుడు చూద్దాం..
తెలుగు న్యూస్ 18 కథనం ప్రకారం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ఏపీ అంతా భగ్గుమంటోంది. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో టిడిపి వర్గాలు రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు తరుఫున వాదించడం కోసం సుప్రీం కోర్టు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రాను టిడిపి నియమించింది. అమరావతి లాండ్ కేసులో కూడా లూథ్రా వాదించారు. చందబాబు నాయుడికి సంబంధించి ఇతర కేసులను కూడా లూథ్రానే చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ కేసులో కూడా విజయవాడ సిబిఐ కోర్టులో లూథ్రా చంద్రబాబు తరుపున వాదించారు. అయితే సిద్దార్ధ్‌ లూథ్రా దేశంలోనే టాప్ 10 లాయర్ల లో ఒకరు మాత్రమే కాదు. దేశంలో అత్యధిక ఫీజు అందుకునే లాయర్లలో ఒకరు. ఇలాంటి ఖరీదైన లాయర్ ను టిడిపి నియమించుకుంది. ఈ కేసును వాదించడానికి లాయర్ సిద్ధార్ధ్ లుథ్రా ప్రత్యేక ఫ్లైట్‌లో ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చారు.
లుథ్రా ఢిల్లీలో కాకుండా వేరే రాష్ట్రాలలో లేదా ప్రాంతాలలో కేసు వాదించడం కోసం  రోజుకు ఫీజు రూ. 1.5 కోట్లు తీసుకుంటారని సమాచారం. అంతే కాకుండా లుథ్రా ప్రయాణానికి ప్రత్యేకమైన ఫ్లైట్ మరియు లగ్జరీ కారుతో పాటుగా స్టార్ హోటల్‌లో వసతి ఏర్పాటు చేయాలని తెలుస్తోంది.

Also Read: స్కిల్ డెవలప్మెంట్ కేసులో “లాయర్ లూథ్రా” వేసిన ప్రశ్నలు ఏంటో తెలుసా..?

 


End of Article

You may also like