గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చందమామ మూవీ హీరోయిన్.. చూస్తే షాకే..!!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చందమామ మూవీ హీరోయిన్.. చూస్తే షాకే..!!

by Sunku Sravan

సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో సింధుమీనన్ ఒకరు. మలయాళీ కుటుంబంలో జన్మించిన సింధు మీనన్ చిన్నతనంలోనే భరత నాట్యం నేర్చుకుంది. చిన్నతనంలోనే డాన్స్ ప్రోగ్రాంలలో పాల్గొని విజేత గా నిలిచే వారు. ఆ డాన్స్ ప్రోగ్రాంకి జడ్జిగా వ్యవహరిస్తున్న భాస్కర్ డైరెక్టర్ కె.విజయ్ రామ్ కు సింధు మీనన్ ను పరిచయం చేయడం జరిగింది. జై రామ్

Video Advertisement

దర్శకత్వం వహించిన రష్మీ అనే కన్నడ చిత్రంతో సింధుమీనన్ 1994లో సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది. ఇలా చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసిన సింధుమీనన్ 1999 వ సంవత్సరంలో ప్రేమ ప్రేమ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమాలో 2001వ సంవత్సరంలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను

పలకరించింది సింధు మీనన్. ఆ తర్వాత తెలుగులో త్రినేత్రం, శ్రీరామచంద్రులు, ఇన్స్పెక్టర్, ఆడంతే అదో టైపు, చందమామ వంటి సినిమాల్లో నటించింది. చందమామ, వైశాలి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది సింధుమీనన్. ఇలా తెలుగు, తమిళ,కన్నడ, మలయాళం వంటి భాషల్లో పలు సినిమాల్లో నటించారు. వంశం అనే మలయాళి సీరియల్ లో కూడా సింధు మీనన్ నటించారు. కొన్ని టీవీ

షోలలో హోస్ట్ గా కూడా వ్యవహరించింది. ఆ తర్వాత ఐటీ ప్రొఫెషనల్ అయినా డొమినిక్ ప్రభు ను 2010లో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక బాబు ఒక పాప ఉన్నారు. అయితే ఇటీవలే సింధుమీనన్ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


You may also like