Ads
ఈ సంవత్సరం వకీల్ సాబ్ తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వచ్చే సంవత్సరం వరుస సినిమాలతో మన ముందుకు రాబోతున్నారు. అందులో మొట్టమొదటిగా విడుదల అవుతోంది భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళం సినిమా అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్ గా రూపొందుతోంది. ఇందులో రానా దగ్గుబాటి కూడా మరొక హీరోగా నటిస్తున్నారు. అయితే, సాధారణంగా మలయాళం సినిమాలో ఇద్దరు హీరోలకు సమానమైన ఇంపార్టెన్స్ ఉంటుంది.
Video Advertisement
ఇద్దరు హీరోలు కథలో కీలక పాత్ర పోషిస్తారు. ఒక హీరోని ఎక్కువ చేయడం, ఒక హీరోని తక్కువ చేయడం, అలా ఏమీ ఉండదు. అందుకే టైటిల్ లో కూడా ఇద్దరి పేర్లు ఉన్నాయి. కానీ తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ పోషించే పాత్ర పేరు మాత్రమే ఉంది. ఈ విషయంపై చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాంతో నిర్మాతలు, “అప్పుడే మీరు నిర్ణయాలు తీసుకోకండి. ఇంకా చాలా అనౌన్స్మెంట్స్ ఉన్నాయి” అని చెప్పారు. కానీ తర్వాత రానా దగ్గుబాటికి సంబంధించిన ఒక వీడియోని విడుదల చేశారు.
అందులో రానా దగ్గుబాటి పేరు డానియల్ శేఖర్ అని రివీల్ చేశారు. కానీ టైటిల్ మాత్రం మార్చలేదు. ఈ విషయం పక్కన పెడితే, సినిమాలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా రానా పాత్రలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయట. మలయాళం ఒరిజినల్ సినిమాలో రానా పాత్ర పోషించిన పృథ్వీరాజ్ ని కూడా మరొక హీరోగానే చూపిస్తారు. కానీ తెలుగులోకి వచ్చేసరికి రానా దగ్గుబాటి పాత్రని విలన్ రూపంలో చూపించబోతున్నారట.
అదే కాకుండా రానా పాత్రకి ఫ్లాష్బ్యాక్ కూడా ఉంటుందట. మలయాళంలో అలాంటిదేమీ ఉండదు. తెలుగులో మాత్రం సినిమాటిక్ లిబర్టీతో చాలా మార్పులు చేస్తున్నారు. హీరో ఎలివేషన్స్ కూడా ఈ మార్చిన కథకి తగ్గట్టుగా రూపొందించారు. ప్రస్తుతం అయితే ఈ సినిమా గురించి ఈ విధంగా వార్తలు ప్రచారంలో అయితే ఉన్నాయి. నెటిజన్లు కూడా, “ఇన్ని మార్పులు చేసే దానికి మళ్లీ రీమేక్ అని చెప్పడం ఎందుకు?” అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం అవుతాయో తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.
End of Article