రెండు సార్లు సెన్సార్ అయ్యి చిరంజీవి పరువు తీసిన ఈ సినిమా ఏంటో తెలుసా.?

రెండు సార్లు సెన్సార్ అయ్యి చిరంజీవి పరువు తీసిన ఈ సినిమా ఏంటో తెలుసా.?

by Mounika Singaluri

Ads

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి కానీ ఒక చిత్రం ఆయన పరువు తీసింది. “అల్లుడా మజాకా”… ఇవివి సత్యనారాయణ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా వచ్చిన ఈ మూవీలో హీరోయిన్లుగా రమ్యకృష్ణ ,రంభ నటించారు. ఇంతకుముందు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలో వాణిశ్రీ చిరంజీవి అత్తగా పోటీపడి మరీ నటించింది. కాబట్టి ఈ చిత్రంలో కూడా వాణిశ్రీ చేత అత్త పాత్ర చేయించాలి అని వివి సత్యనారాయణ భావించారు.  వాణిశ్రీ మాత్రం ఈ పాత్ర చేయలేను అని సున్నితంగా తిరస్కరించడం జరిగింది.

Video Advertisement

అయితే వాణిశ్రీ గారు ఎందుకు రిజెక్ట్ చేసారు అంటే..కథ ప్రకారం ఈ సినిమాలో అత్త హీరోతో కలిసి స్టెప్పులు వేయాల్సి ఉంటుంది…పైగా ఒక రే-ప్ సీన్‌లో న‌టించాల్సి ఉంటుంది. ఇది నచ్చని వాణిశ్రీ ఈ సినిమా ఒప్పుకోలేదట.. దాంతో మరొక సీనియర్ నటి లక్ష్మి తో ఈ క్యారెక్టర్ చేయించారు. ఇందులో రంభ ,రమ్యకృష్ణ, లక్ష్మి కలిసి ఉండే.. ఒక సరదాగా సాగే..రే-ప్ సీన్ అప్పట్లో పెద్ద వివాదానికి కారణమైంది. పైగా మూవీలో లక్ష్మీ వేషధారణ పై కూడా ఎన్నో అభ్యంతరాలు వినిపించాయి. ఇందులో కొన్ని చోట్ల కామెడీ వల్గర్ గా ఉంది అన్న విమర్శలు కూడా వచ్చాయి.

మరోపక్క ఇటువంటి సీన్లు నటించినందుకు చిరంజీవిని కూడా విమర్శించిన వారు ఉన్నారు. మనదేశంలో అత్తను అమ్మతో సమానంగా చూసే సంప్రదాయం ఉన్నప్పుడు.. ఇలాంటి పాత్ర ఎందుకు చేశారు అని కామెంట్స్ చేసారు. అంతేకాదు ఈ సినిమా రెండుసార్లు సెన్సార్ కి వెళ్లి వచ్చింది. అలా అప్పటివరకు చిరంజీవి సినిమాల్లో రెండు సార్లు సెన్సార్ కి వెళ్లి చెత్త రికార్డు క్రియేట్ చేసిన చిత్రంగా ఇది నిలిచిపోయింది.


End of Article

You may also like